Home » చిరంజీవి సినిమాల్లో ఈ కామన్ పాయింట్ గమనించారా..మరి ఇంత త్యాగమా..!!

చిరంజీవి సినిమాల్లో ఈ కామన్ పాయింట్ గమనించారా..మరి ఇంత త్యాగమా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా స్టార్ గా ఎదిగిన హీరో చిరంజీవి. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇండస్ట్రీలోనే పెద్ద అయ్యారు చిరంజీవి.. అలాంటి చిరంజీవి ఏ సినిమా తీసిన అందులో ఈ కామన్ పాయింట్ మాత్రం తప్పనిసరిగా ఉంటుంది.. అది ఇప్పటి వరకు ఎవరు గమనించారో లేదో కానీ ఆ సీన్ ఉంటే ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని నమ్ముతారట. అయితే చిరంజీవి రాబోయే సినిమా గాడ్ ఫాదర్ టీజర్ విడుదలైంది.. కానీ అభిమానులను ఇది అంతగా ఆకట్టుకున్నట్టు కనిపించడం లేదని ఒక వర్గం వారు భావిస్తున్నారు.. అయితే చిరంజీవి సినిమా తీస్తే ఆ మూవీ లో ఎవరో ఒకరు చనిపోతూ త్యాగం చేయాల్సిందేనంటూ కూడా ప్రశ్నిస్తున్నారు..

Advertisement

ALSO READ:లైగర్ సినిమా ప్లాప్ అయితే.. జర్నలిస్ట్ ప్రశ్నకు హీరో విజయ్ ఇచ్చిన షాకింగ్ ఆన్సర్ ఏంటంటే..?

Advertisement

ఒకప్పుడు చిరంజీవి మూవీ వచ్చింది అంటే అందులో చనిపోయే పాత్రను అచ్యుత్ చేసేవాడు. కానీ ఇప్పుడు అలాంటి పాత్ర చేయడం కోసం సత్యదేవుని తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. మరి ఇప్పుడైనా సత్యదేవ్ మధ్యలో చనిపోయి చిరంజీవికి వచ్చే సినిమాకు ఇట్టే ఇస్తాడో లేదో అని అభిమానుల్లో ఒక తెలియని కలవరం ఉంది.. దీంతో కొంతమంది ఎవరో ఒకరు టాలీవుడ్ హీరో కోసం చనిపోవలసిందేనా అంటూ కామెంట్ కూడా పెడుతున్నారు.. ఇటీవల వచ్చిన ఆచార్య మూవీ లో హీరో రామ్ చరణ్ మధ్య లోనే చనిపోతారు..

అయితే ఇలా ఎవరో ఒకరు చనిపోతే తప్ప చిరంజీవికి హిట్ పడదా అంటూ ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. అయితే గాడ్ ఫాదర్ టీజర్ రిలీజ్ అయిన వెంటనే మిక్స్ డ్ టాక్ తో మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. ఇందులో సల్మాన్ఖాన్ గ్రాఫిక్స్ లో కనిపించడంతో ఈ సినిమా ఫలితాన్ని అభిమానులు సైతం అంచనా వేయలేకపోతున్నారు. ఈ మూవీలో చిరంజీవి యంగ్ లుక్ లో కనిపించేందుకు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ఇన్ని ట్విస్ట్ లు ఉన్న ఈ మూవీ ఇలాంటి ఫలితాన్నిస్తుందో వేచి చూడాల్సిందే.

ALSO READ:తాత్కాలిక కోచ్ గా లక్ష్మణ్ కే బాధ్యతలు..!

Visitors Are Also Reading