Home » మంత్రి రోజాకి అవ‌మానం జ‌రిగిందా..? స్టేజీపై ఆమె క‌న్నీరు ఎందుకు పెట్టింది..!

మంత్రి రోజాకి అవ‌మానం జ‌రిగిందా..? స్టేజీపై ఆమె క‌న్నీరు ఎందుకు పెట్టింది..!

by Anji
Ad

సాధార‌ణంగా పండుగ‌ల సీజ‌న్ వ‌చ్చిందంటే చాలు.. పాపుల‌ర్ టీ వీ ఛాన‌ల్స్ అన్నీ బుల్లితెర‌పై స‌రికొత్త వినోద కార్య‌క్ర‌మాలు ఫ్లాన్ చేస్తుంటాయి. మ‌రో వైపు థియేట‌ర్లలో కొత్త సినిమాల‌తో క‌ళ‌క‌ల‌లాడుతుంటాయి. ఇప్పుడు రాబోతున్న ద‌స‌రా పండుగ కోసం ప్ర‌ముఖ ఛానల్స్ సినీ, బుల్లితెర సెల‌బ్రెటిల‌తో పుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ ప్ర‌క‌టించాయి. ఎప్ప‌టిమాదిరిగానే ఈటీవీ వారు ద‌స‌రా వైభ‌వం అనే ప్రోగ్రామ్‌తో ముందుకు రాబోతున్నారు. ద‌స‌రా స్పెష‌ల్ ఎపిసోడ్‌కి సంబంధించి ప్రోమో విడుద‌ల చేశారు.


ఈ ప్రోమో చూస్తుంటే ద‌స‌రా ఈవెంట్ కోసం న‌టి, ఏపీ మంత్రి రోజా ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న‌ట‌ట్టు తెలుస్తోంది. ఇక స్టేజీపై ఎంట‌ర్ అవ్వ‌గానే అంద‌రూ ఉత్సాహంగా ఆహ్వానం ప‌లికారు. ఆ ఆనందంలోనే రోజా కూడా హైప‌ర్ ఆది లాంటి క‌మెడీయ‌న్స్ పై కొన్ని పంచులు వేశారు. ప్రోమో అలా స‌ర‌దాగా సాగింది. సినీ న‌టుడు కృష్ణ‌భ‌గ‌వాన్ కూడా స్పెష‌ల్ గెస్ట్‌గా హాజ‌ర‌య్యారు. ఈ ఎపిసోడ్‌లో ఆటో రాంప్ర‌సాద్, హైప‌ర్ ఆది ఇద్ద‌రూ కూడా కూర‌గాయ‌ల వ్యాపారం చేస్తున్న స్కిట్‌తో అంద‌రినీ న‌వ్వించారు.

Advertisement

Advertisement

Also Read :  Jabardasth: మరో నటుడిని కోల్పోయిన తెలుగు ఇండస్ట్రీ..!!


ఇక ఆ త‌రువాత గెట‌ప్ శ్రీ‌ను ద‌శావ‌తారం కాన్సెప్ట్ తో ఒక్కో గెట‌ప్‌లో అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు. ఈ త‌రుణంలో ప్రోమో చివ‌రి ద‌శ‌కు వ‌చ్చే సిరిక రోజా ఒక్క‌సారిగా అంద‌రిపై సీర‌య‌స్ అయింది. న‌న్ను అవ‌మానించ‌డానికి ఈ షోకి ర‌మ్మ‌న్నారా..? ప్లాన్ చేసుకుని పిలిచారా అంటూ వెంట‌నే ఎమోష‌న‌ల్ అవుతూ స్టేజీపై నుంచి వెళ్లిపోవ‌డం క‌నిపించింది.

Also Read :  వివాహానికి ముందు అబ్బాయి, అమ్మాయి ఒకరి గురించి మరొకరు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు !

Visitors Are Also Reading