Home » బుమ్రా మళ్ళీ లేనట్లే.. చెప్పేసిన పాండ్య..!

బుమ్రా మళ్ళీ లేనట్లే.. చెప్పేసిన పాండ్య..!

by Azhar
Ad
భారత జట్టులో కీలక బౌలర్ బుమ్రా అనే విషయం అందరికి తెలిసిందే. కానీ గాయమే కారణంగా చాలా రోజుల నుండి బుమ్రా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. కానీ ఈ మధ్యే ఫిట్నెస్ సాధించాడు అని బుమ్రాను ప్రపంచ కప్ తో పాటుగా… ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్ కూడా ఎంపిక చేసారు సెలక్టర్లు. ఆసీస్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో బుమ్రా జట్టులో లేడు.
జట్టు కెప్టెన్ రోహిత్.. బుమ్రా ఇంకా కోలుకోలేదు అని.. అందుకే అతనిని ఈ మ్యాచ్ కు ఎంపిక చేయలేదు అన్నాడు. ఇక బుమ్రా లేని లోటు కనిపిస్తూ.. మొదటి మ్యాచ్ లో ఇండియా ఓడిపోయింది. అయిన రెండో మ్యాచ్ లో మళ్ళీ బుమ్రా వస్తాడు అని చాలా మంది అనుకున్నారు. కానీ రేపు జరిగే రెండో మ్యాచ్ లో కూడా బుమ్రా లేనట్లే అనేది తెలిసిపోయింది.
భారత స్టార్ ఆల్ రౌండర్ పాండ్య తాజాగా మాట్లాడుతూ.. మొదటి మ్యాచ్ లో బుమ్రా లేని లోటు తెలిసింది. కానీ బుమ్రా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అతనిపైన మేము ఎటువంటి ఒత్తిడి అనేది పెట్టాలి అనుకోవటం లేదు. అందుకే బుమ్రాకు విశ్రాంతి కలిపిస్తునం. అతను కోలుకోవడానికి ఇంకొంచెం సమయం పడుతుంది అని చెప్పాడు. అయితే పాండ్య మాటలతో బుమ్రా ఇంకా కోలుకోలేదు.. అతను రేపు మ్యాచ్ లో కూడా ఆడటం లేదు అనే విషయం అందరికి స్పదటం అయ్యింది.

Advertisement

Visitors Are Also Reading