Home » ధోని వల్లే ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న పాండ్య..!

ధోని వల్లే ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న పాండ్య..!

by Azhar

భారత జట్టులో ప్రస్తుతం కొందరు కీలక ఆటగాళ్లు ఉన్నారు. వారు జట్టులో లేకపోతే జట్టు యొక్క బ్యాలెన్స్ అనేది తప్పకుండ పోతుంది. అటువంటి వారిలో భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య మొదటి స్థానంలో ఉంటాడు అనేది అందరికి తెలిసిందే. పాక్ ఉన్నప్పుడు.. పాండ్య లేన్నపుడు అని విడదీసి చూస్తే జట్టులో ఉండే తేడా అనేది అందరికి అర్ధం అవుతుంది.

అయితే భారత జట్టులోకి బౌలింగ్ ఆల్ రౌండర్ గా వచ్చిన పాండ్య.. ఇప్పుడు బ్యాటింగ్ లోను రాణిస్తున్నాడు. ప్రస్తుతం భారత జట్టుకు ఫినిషర్ గా కూడా వ్యవరిస్తున్నాడు. అయితే 2019 ప్రపంచ కప్ తర్వాత పాండ్య గాయంతో జట్టుకు దూరమైన సమయంలో అతని విలువ అనేది అందరికి తెలిసిందే. కానీ తాను ఇప్పుడు ఇలా ఉండటానికి భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కారణం అని పాండ్య పేర్కొన్నాడు.

తాజాగా పాండ్య మాట్లాడుతూ.. నేను జట్టులోకి వచ్చిన తర్వాత ధోని నాతో చెప్పిన ఓ మాట ఇంకా నాకు గుర్తుకు ఉంది. బ్యాటింగ్ చేసే సమయంలో ఎప్పుడు స్కోర్ బోర్డును చూడాలి. ని స్కోర్ ను చూసుకోవడానికి కాదు.. జట్టు స్కోర్ చూసి పరిస్థితి అనేది అంచనా వేసి.. దానికి తగ్గిన విధంగా బ్యాటింగ్ చేయాలి. నీ వ్యక్తిగత స్కోర్ కోసం బ్యాటింగ్ చేస్తే అది ఎందుకు పనికిరాదు అని ధోని తనతో చెప్పినట్లు.. ఇక తాను ఇప్పటికి దానిని ఫాలో అవుతాను అని పాండ్య అన్నాడు.

ఇవి కూడా చదవండి :

పాకిస్థాన్ కు వెళ్ళం అని తేల్చిన భారత్..!

బీసీసీఐ కొత్త బాస్ పై దాదా రియాక్షన్..!

Visitors Are Also Reading