ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలలో భాగంగా పంజాబ్ రాష్ట్రానికి కూడా ఎన్నికలు జరిగాయి. ఇక ఈ రాష్ట్రంలో అనూహ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు కొన్ని వార్తలు నేషనల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
Advertisement
Advertisement
పంజాబ్ కు చెందిన భారత మాజీ క్రికెట్ ఆటగాడు హర్బజన్ సింగ్ ను రాజ్యసభకు పంపించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.అతే కాకుండా జలంధర్ లో ఏర్పాటు చేసే స్పోర్ట్స్ యూనివర్సిటీ బాధ్యతలను కూడా హర్బజన్ కు అప్పగించే ఆలోచనలో ఆప్ ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఆమ్ ఆద్మీ ఇప్పటికే ఢిల్లీ లో అధికారం లో ఉండగా ఇప్పుడు పంజాబ్ లోనూ జెండా ఎగురవేసింది. మరోవైపు సౌత్ పై కూడా ఆప్ కన్నేసింది.