Home » 11 మందితో పెళ్లి, పక్క పక్క వీధుల్లో కాపురం..హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చిన నిత్య పెళ్ళికొడుకు భాగోతం…!

11 మందితో పెళ్లి, పక్క పక్క వీధుల్లో కాపురం..హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చిన నిత్య పెళ్ళికొడుకు భాగోతం…!

by AJAY
Ad

ఇటీవల కాలంలో మ్యారేజ్ బ్యూరో ద్వారా పెళ్లిళ్లు చేసుకుని మోసాలు చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా హైదరాబాద్ లో ఓ నిత్య పెళ్లి కొడుకు వ్యవహారం సంచలనగా మారింది. ఒకరు ఇద్దరు కాకుండా ఏకంగా 11 మందిని పెళ్లి చేసుకుని వారిని మోసం చేశాడు ఆ ప్రబుద్ధుడు. మోసపోయిన ఇద్దరు బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో నిత్య పెళ్ళికొడుకు వ్యవహారం బయటకు వచ్చింది.

Advertisement

పూర్తి వివరాల్లోకి వెళితే…. గుంటూరు జిల్లా బేతంపూడి కి చెందిన శివశంకర్ బాబు అనే వ్యక్తి మ్యారేజ్ బ్యూరో ద్వారా కొంతమంది యువతులను పరిచయం చేసుకున్నాడు. పెళ్లై విడాకులు తీసుకున్న యువతులను టార్గెట్ గా చేసుకొని ఒకరికి తెలియకుండా మరొకరిని ఇలా మొత్తం 11 మందిని పెళ్లి చేసుకున్నాడు. తాను ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని రాత్రింబవళ్లు కష్టపడాల్సి వస్తుందని చెబుతూ ఒకరికి తెలియకుండా మరొకరిని మెయింటైన్ చేస్తూ వచ్చాడు.

Advertisement

అంతేకాకుండా పెళ్లి చేసుకున్న వారి దగ్గర డబ్బులు నగలు తీసుకుని వారిని మోసం చేశాడు బాధితులందరితో పక్కపక్క వీధుల్లోనే నివాసం ఏర్పాటు చేసుకున్నాడు.. శివశంకర్ చేతిలో మోసపోయిన ఇద్దరు మహిళలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో సంచలన నిజాలు బయటపెట్టారు. పెళ్లి తర్వాత అవసరాల కోసం తమ వద్ద లక్షల్లో డబ్బులు తీసుకున్నాడని ఆరోపించారు.

వ్యాపారం కోసం వెళుతున్నట్టు చెప్పి ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేవాడని తెలిపారు. తమ ఇద్దరి దగ్గర సుమారు 60 లక్షల నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్నాడని బాధితులు ఆరోపించారు. అంతేకాకుండా తమతో పాటు మిగతా వాళ్లను కొండాపూర్ ప్రాంతంలో పక్కపక్క వీధుల్లో ఉండేలా ఏర్పాటు చేసి జీవితాలతో ఆడుకున్నాడని ఆరోపించారు. నిందితుడు ఏపీకి చెందిన ఓ మంత్రి బంధువు అని బాధితులు చెబుతున్నారు.

Also read : తెలుగు సినిమాల్లో ఎంతో పేరు సంపాదించుకున్న ‘రావు గోపాల్ రావు’ చనిపోతే ఇండస్ట్రీ పెద్దలు ఎందుకు చూడటానికి కూడా వెళ్ళలేదు..?

Visitors Are Also Reading