Home » కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు ఆత్మ‌హ‌త్య

కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు ఆత్మ‌హ‌త్య

by Sravan Sunku
Ad

మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని బ‌ర్గి నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డ్డాడు.
వివ‌రాల్లోకి వెళ్లితే.. బ‌ర్గి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజ‌య్ యాద‌వ్ కుమారుడు విభోర్ యాద‌వ్ (17) సూసైడ్ నోట్ రాసి ఆత్మ‌హత్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న గోర‌ఖ్‌పూర్‌లోని ఎమ్మెల్యే నివాసంలో చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం త‌న గ‌దిలో రివాల్వ‌ర్‌తో త‌ల‌పై కాల్చుకున్నాడు. రివాల్వ‌ర్ పేలిన శ‌బ్దం విని కుటుంబ స‌భ్యులు ఉలుక్కి ప‌డి హుటాహుటిన విభోర్ యాద‌వ్ గ‌దికి వ‌చ్చారు.

Advertisement

Advertisement

అప్ప‌టికే త‌ల‌పై కాల్చుకోవ‌డంతో వెంట‌నే కుటుంబ స‌భ్యులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ విభోర్ మ‌ర‌ణించాడు. ఈ విష‌యం తెలుసుకున్న ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు ఆసుప‌త్రికి చేరుకుని మృతుని కుటుంబానికి సానుభూతి ప్ర‌క‌టించారు. ఆసుప‌త్రి చుట్టూ భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు పోలీసులు. విభోర్ యాద‌వ్ ఎందుకు కాల్చుకున్నాడ‌నే విష‌యంపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. పోలీసులు అత‌ను రాసిన సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా నా త‌ల్లిదండ్రులు చాలా మంచివారు అని రాసిన‌ట్టు తెలుస్తోంది. ఈ సంఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు వేగ‌వంతం చేస్తున్న‌ట్టు వెల్ల‌డించారు పోలీసులు.

ఇవి కూడా చదవండి: కిషన్‌రెడ్డి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తీసుకురావాలి : మంత్రి హరీష్‌రావు

Visitors Are Also Reading