Home » మహేష్ బాబు మూవీలో విలన్ గా నటించే అవకాశాన్ని కోల్పోయిన గోపిచంద్…ఆ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఎదో తెలుసా ?

మహేష్ బాబు మూవీలో విలన్ గా నటించే అవకాశాన్ని కోల్పోయిన గోపిచంద్…ఆ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఎదో తెలుసా ?

by AJAY
Ad

సినిమా ఇండ‌స్ట్రీలో హీరోలుగా చాలా మంది స‌క్సెస్ అవుతుంటారు. చాలా మంది విల‌న్ పాత్ర‌ల‌తో స‌క్సెస్ అవుతారు. కానీ అతి కొద్ది మంది మాత్ర‌మే ఓ వైపు హీరోలుగా మ‌రోవైపు విల‌న్ పాత్ర‌లతోనూ మెప్పిస్తుంటారు. అలాంటి వారిలో గోపిచంద్ కూడా ఒక‌రు. గోపిచంద్ నితిన్ హీరోగా న‌టించిన జ‌యం సినిమాతో విల‌న్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో గోపిచంద్ విల‌నిజం చూసి ప్రేక్ష‌కులు భ‌య‌ప‌డిపోయారు.

 

Advertisement

ఆ త‌ర‌వాత వ‌ర్షం సినిమాలో ప్ర‌భాస్ ను డీ కొట్టే పాత్ర‌లో విల‌న్ గా నటించాడు. ఈ సినిమాలో కూడా గోపిచంద్ విల‌న్ గా ప్ర‌శంస‌లు అందుకున్నాడు. అయితే గోపీచంద్ క‌టౌట్ అటు విల‌న్ గా ఇటు హీరోగా కూడా సెట్ అవుతుంది. గోపీచంద్ హీరోగా న‌టించిన య‌జ్ఞం సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. ఆ త‌ర‌వాత గోపించంద్ విల‌న్ గా కాకుండా హీరోగా కొన‌సాగుతున్నాడు.

Advertisement

ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌లు సూప‌ర్ హిట్స్ అందుకున్నాడు. చివ‌ర‌గా గోపిచంద్ గోలీమార్ సినిమాతో ప్రేక్ష‌కుల మందుకు వ‌చ్చాడు. ఈ సినిమా నిరాశ‌ప‌రిచింది. రీసెంట్ గా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ అనే సినిమాలో న‌టించాడు. ఈ సినిమా జూలై1న విడుద‌లైంది. ఇదిలా ఉంటే గోపిచంద్ కు ఒక‌ప్పుడు మ‌హేశ్ బాబు హీరోగా నటించిన ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలో కూడా ఛాన్స్ వ‌చ్చిన విషయం అతిత‌క్కువ మందికి మాత్ర‌మే తెలుసు.

మ‌హేశ్ బాబు భూమిక హీరోహీరోయిన్ లుగా ఒక్క‌డు సినిమా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ప్ర‌కాష్ రాజ్ విల‌న్ గా న‌టించాడు. అయితే మొద‌ట ప్ర‌కాష్ రాజ్ డేట్స్ సెట్ అవ్వ‌క‌పోవ‌డంతో ఆఫర్ గోపీచంద్ వ‌ద్ద‌కు వెళ్లింది. దాంతో గోపించంద్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. కానీ ప్రకాష్ రాజ్ డేట్స్ స‌ర్దుబాటు చేసుకుని ఒక్క‌డు కోసం సిద్దం అయ్యాడు. దాంతో గోపిచంద్ డ్రాప్ అవ్వాల్సి వ‌చ్చింది. అలా గోపిచంద్ బ్లాక్ బ‌స్ట‌ర్ ను మిస్ చేసుకున్నాడు.

Visitors Are Also Reading