Home » బాలయ్య డైరెక్టర్ కు ఖరీదైన బహుమతి ఇచ్చిన చిరంజీవి… ఎందుకో తెలుసా..?

బాలయ్య డైరెక్టర్ కు ఖరీదైన బహుమతి ఇచ్చిన చిరంజీవి… ఎందుకో తెలుసా..?

by AJAY
Ad

నటసింహం నందమూరి బాలయ్య హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా వీర సింహారెడ్డి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా ను భారీ బడ్జెట్ తో నిర్మించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. మొదటి రోజు ఈ సినిమాకు కలెక్షన్ ల వర్షం కురిసింది. ఈ సినిమా సక్సెస్ అవ్వడం తో ఓ ఇంటర్వ్యూ లో దర్శకుడు గోపీచంద్ మలినేని ఆసక్తికర కామెంట్ లు చేశారు.

Advertisement

Advertisement

వీర సింహారెడ్డి సినిమా విషయం లో ముందు నుండి కాన్ఫిడెన్స్ గా ఉన్నానని చెప్పారు. సంక్రాంతి కి విడుదలైన రెండు సినిమాలు విజయం సాధిస్తాయని ముందుగానే ఊహించానని చెప్పారు. సినిమా లపై ఉన్న పిచ్చితో ఇంటర్ మధ్యలోనే అపేశా అని చెప్పారు. అంతే కాకుండా వీర సింహా రెడ్డి సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తన పుట్టినరోజు ఆ సినిమా సెట్స్ లో జరిగిందని తెలిపాడు.

ఆ వేడుకకు చిరంజీవి అల్లు అరవింద్ తో కలిసి వచ్చారని తనకు వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చారని అన్నారు. అంతే కాకుండా ఈరోజు నుండి నీ టైమ్ మారుతుంది అని చిరు చెప్పారని అన్నాడు. ఇక ఇప్పటి వరకు తాను ఒక్క వీర సింహారెడ్డి సినిమాకు మాత్రమే పూర్తి రెమ్యునరేషన్ ను అందుకున్నట్లు తెలిపారు.

Also read : ప్రేమిస్తే హీరో భరత్ లవ్ స్టొరీ గురించి మీకు తెలుసా ?

Visitors Are Also Reading