Home » పుష్పలో విలన్ గా మరో టాలీవుడ్ హీరో..?

పుష్పలో విలన్ గా మరో టాలీవుడ్ హీరో..?

by Azhar
Ad

అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. అయితే ఈ సినిమాపై మొదటి నుండి మంచి అంచనాలు ఉన్నాయి. అందుకు కారణం చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ తో కలిసి చేస్తున్న సినిమా కావడం. ఇక ఈ సినిమా అందరి అంచనాలకు తగ్గట్లే సౌత్ తో పాటుగా హిందీలో కూడా బీభత్సము సృష్టించింది.

Advertisement

ఇక మొత్తం 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమాకు రెండవ భాగం కుండా ఉంది అని చిత్రయూనిట్ ముందే చెప్పింది. దాంతో ఇప్పుడు అందరూ ఆ సీక్వెల్ కోసం ఎదురు చుస్తున్నారు. అయితే ఈ మధ్యే ఈ సినిమా యొక్క షూటింగ్ పూజ అనేది జరిగింది. ఇక ఈ సినిమాలో ఫహద్, సునీల్ విలన్ గా నటించారు. కానీ రెండవ భాగంలో మరో విలన్ రాబోతున్నట్లు తెలుస్తుంది.

Advertisement

పుష్ప సీక్వెల్ లో రాజకీయ బలం ఉన్న ఓ విలన్ పాత్ర అనేది కనిపించబోతున్నట్లు సమాచారం. ఇక ఆ పాత్రలో ఓ టాలీవుడ్ హీరో నటించినబోతున్నట్లు తెలుస్తుంది. అది ఎవరో కాదు.. హీరో గోపీచంద్. అయితే గోపీచంద్ కెరియర్ మొదట్లో విలన్ పాత్రలోనే చేసిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఆయన హీరోగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ పుష్ప సినిమాతో తన విలనిజం అనేది అందరికి హుపించబోతున్నట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

పాండ్యకు ఏమైంది.. నేటి మ్యాచ్ లో ఎందుకు లేడో తెలుసా..?

ఇండియా, పాకిస్తాన్‌ కు ఫైన్ వేసిన ఐసీసీ…!

Visitors Are Also Reading