Home » గోల్డ్ చైన్ మింగేసిన గోమాత‌.. త‌ర్వాత‌ ఏం చేశరంటే..?

గోల్డ్ చైన్ మింగేసిన గోమాత‌.. త‌ర్వాత‌ ఏం చేశరంటే..?

by Bunty
Ad

బంగారం తో గోమాత ను అలంక‌రిస్తే.. ఆ బంగారాన్నే గోమాత మింగేసింది. ఈ వింత సంఘ‌ట‌న క‌ర్ణాట‌క రాష్ట్రం లో చోటు చేసుకుంది. క‌ర్ణాటక రాష్ట్రం లో ని ఉత్త‌ర క‌న్న‌డ జిల్లా లో హీప‌న హ‌ల్లీ అనే ప్రాంతం లో శ్రీ కాంత్ అనే వ్య‌క్తి కి ఒక ఆవు తో పాటు ఒక దూడ కూడా ఉంది. అయితే శ్రీ కాంత్ త‌న గో మాత తో పాటు దూడ కు బంగారం తో అలంక‌రించి పూజలు చేశాడు. అయితే దూడ మెడ లో ఉన్న గోల్డ్ చైన్ పూల మాల లో క‌లిసి పోయి ఉంది.

Advertisement

Advertisement

అయితే గో మాత త‌న దూడ మెడ లో ఉన్న పూల మాల తో పాటు బంగార గొలుసు నూ కూడా మింగేసింది. ఆ గోల్డ్ చైన్ దాదాపు రెండు తులాల గా ఉంటుంది. అయితే పూజా త‌ర్వాత శ్రీ కాంత్ గోల్డ్ చైన్ కోసం వెతికగా అది క‌నిపించ లేదు. చాలా రోజుల గ‌డిచినా.. ఆ బంగార‌పు గోలుసు ల‌భించ‌లేదు. దీంతో శ్రీ కాంత్ కు అనుమానం వ‌చ్చి.. ఒక వెట‌ర్నరీ డాక్ట‌ర్ ను శ్రీ కాంత్ క‌లిసాడు. ఈ విష‌యం ఆ డాక్ట‌ర్ తో చ‌ర్చించి ఇద్ద‌రూ కూడా ఆవు ద‌గ్గ‌ర కు వ‌చ్చారు. ఆ డాక్ట‌ర్ గోమాత ను ప‌రిశీలించి ఆ గోల్డ్ చైన్ ఆవు పోట్ట లో నే ఉంద‌ని తెలిపాడు. దీంతో గో మాత కు స‌ర్జరీ చేసి ఆ రెండు తులాల‌ గోల్డ్ చైన్ ను తీశారు.

 

అయితే ఆవు పోట్ట లో నే నెల‌ల పాటు ఉండటం తో ఆ చైన్ దాద‌పు 2 గ్రాములు త‌గ్గి పోయింది. అయితే ఆవు జీర్ణ‌శ‌యం లో అది ఉండ‌గా.. అక్క‌డ ఉండే యాసిడ్ ల వల్ల బంగారం బ‌రువు త‌గ్గి పోయింద‌ని డాక్ట‌ర్లు తెలిపారు. అయితే పోయింద‌ను కున్న బంగారం ల‌భించిందని శ్రీ కాంత్ సంతోష ప‌డ్డాడు. అలాగే ఆవు కూడా ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేద‌ని డాక్ట‌ర్లు కూడా తెల్చి చెప్పారు.

Visitors Are Also Reading