Home » VIRAL : స్కూటీ కి బైకు తగిలిందని యువతి రచ్చ..!

VIRAL : స్కూటీ కి బైకు తగిలిందని యువతి రచ్చ..!

by Anji
Ad

సోషల్ మీడియాలో అన్ని వీడియోలు తీసి షేర్ చేయడం పరిపాటిగా మారింది. చాలా వరకు వైరల్‌గా మారుతుంటాయి. కామెడీ ఎమోషనల్ ఎలా అయితే అది తేడా లేకుండా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడ ఏది చోటుచేసుకున్న చేతుల్లోనే దర్శనమిస్తుంటుంది. ఓకే రోజురోజుకు సోషల్ మీడియాకు విపరీతమైన క్రేజ్ పెరుగుతోంది. ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Advertisement

Advertisement

ముఖ్యంగా ఈ వీడియో చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఓ అమ్మాయి రోడ్డు మీద చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇటవా లో ఓ అమ్మాయి స్కూటీ వేస్కోని వెళ్తున్న సమయం లో అనుకోకుండా ఓ అబ్బాయి బైక్ పై వచ్చి ఆ అమ్మాయి స్కూటీని తాకాడు. వెంటనే ఆ అమ్మాయి ఆగ్రహంతో ఊగిపోయింది. ఆ అబ్బాయి బైకు ఆపి ఫోను గుంజుకుని నేలకేసి కొట్టింది. ఈ తతంగమంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడు అది వైరల్ గా మారింది.

 

ఈ ఘటన గురించి ఓ యువకుడు ఇలా చెప్పాడు. బైకును తగిలించినందుకు తాను ఆ అమ్మాయికి క్షమాపణలు చెప్పాను. కానీ ఆమె ఆవేశం తో నా మొబైల్ ను లాక్కొని పగలగొట్టింది. మంగళ్ అనే యువకుడు బైకు మీద చెరువు వైపునకు వెళుతున్నాడు. ఆ సమయంలో ఫోన్ మాట్లాడి అకస్మాత్తుగా ఆ యువకుడు యువతి స్కూటీని తాకాడు. దీంతో ఆమె నానా మాటలు తిడుతూ.. తర్వాత కోపం ఆపుకోలేక ఫోన్ పగలగొట్టింది. ఇంకా జరిగినా రోడ్ మీద జనం గుమిగూడారు కానీ ఎవరూ స్పందించలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

 

Visitors Are Also Reading