Home » సంసారానికి ప‌నికి రాడ‌ని తెలిసి పెళ్లి..! న్యాయం చేయాల‌ని బాధితురాలు నిర‌స‌న‌

సంసారానికి ప‌నికి రాడ‌ని తెలిసి పెళ్లి..! న్యాయం చేయాల‌ని బాధితురాలు నిర‌స‌న‌

by Anji
Ad

పెళ్లి అంటే నూరేళ్ల పంట‌. వంద అబ‌ద్ధాలు చెప్పి అయినా ఓ పెళ్లి చేయాలంటారు. చాలా వ‌ర‌కు అలాగే చేస్తుంటారు కూడా. కానీ కొన్ని సంద‌ర్భాల్లో చెప్పిన అబ‌ద్ధాలు తెలిస్తే ఇక వామ్మో అనాల్సిందే. చిన్న చిన్న విష‌యాలు అబ‌ద్దాలు చెప్పి పెళ్లి చేసుకుంటే ప‌ర‌వాలేదు. జీవితానికి సంబంధించిన విష‌యాల‌ను దాచిపెడితే ఇక అంతే సంగ‌తులు అలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది.


త‌న భ‌ర్త త‌న‌తో సంసారం చేయ‌డానికి ప‌నికి రాడ‌ని తెలిసి కూడా త‌న‌కు పెళ్లి చేసార‌ని ఆరోపిస్తూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా చంద‌ర్ల‌పాడు మండ‌లం ఏటూరు వ‌ద్ద ఉన్న కృష్ణ‌న‌దిలో ఆ బాధితురాలు నిర‌స‌న చేప‌ట్టింది. ముఖ్యంగా త‌న‌కు పెళ్లి జ‌రిగి మూడు రాత్రులు గ‌డిచినా భ‌ర్త త‌న వ‌ద్ద‌కు రాకుండా దూరంగా ఉండ‌డంతో అత్త‌, మామల‌కు తెలిపాన‌ని.. త‌మ ప‌రువు పోతుంద‌ని బ‌య‌ట‌కు చెప్పొద్దంటూ బెదిరింపుల‌కు గురి చేశారంటూ బాధితురాలు వాపోయింది.

Advertisement

Advertisement

ఇక త‌న‌కు విడాకులు కావాల‌ని అడ‌గ‌డంతో గ్రామ పెద్ద‌ల స‌మ‌క్షంలో త‌న‌కు రూ.15ల‌క్షలు ఇస్తాన‌ని అత్త‌, మామ‌లు ఒప్పుకున్నార‌ని వెల్ల‌డించింది. చివ‌రికీ ఆ డ‌బ్బు ఇవ్వ‌క‌పోవ‌డంతో పాటు త‌మ‌పై కోర్టుకు వెళ్లి త‌మ‌ను ఇబ్బందుల‌కు గురి చేసి త‌మ‌పై ప‌రువు న‌ష్టం దావా వేశార‌ని బాధితురాలు ఆవేద‌న వ్య‌క్తం చేసింది. త‌మ‌కు న్యాయం జ‌రిగేంత వ‌ర‌కు కృష్ణాన‌దిలో నిర‌స‌న చేప‌డుతామ‌ని బాధితురాలు, ఆమె కుటుంబ స‌భ్యులు పేర్కొంటున్నారు.

Also Read : 

ఎన్టీఆర్ నవ్వుకున్నా చోటే నిలబడిన డి రామానాయుడు…!

బ్రహ్మానందం కి ఏమైంది.. సినిమాల్లో కనిపించకపోవడానికి కారణం ఏంటో తెలుసా..!!

Visitors Are Also Reading