Home » జెనీలియాకు రితేష్ కంటే ముందే వేరే వ్యక్తితో పెళ్లి చేశానంటూ కేసు పెట్టిన పంతులు..!!

జెనీలియాకు రితేష్ కంటే ముందే వేరే వ్యక్తితో పెళ్లి చేశానంటూ కేసు పెట్టిన పంతులు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

నాలుగు పదుల వయసులో కూడా ఏమాత్రం తరగని అందంతో ఇప్పటికే సోషల్ మీడియాలో అభిమానులను అలరిస్తూనే ఉంటుంది ముద్దుగుమ్మ జెనీలియా. చిన్న వయసు లోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆమె తుజే మేరీ కసం అనే బాలీవుడ్ సినిమా ద్వారా ఇండస్ర్టీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈమె ఎక్కువగా తెలుగు, తమిళ్ సినిమాల్లో నటించింది. అప్పట్లో తెలుగులో చేసిన బొమ్మరిల్లు సినిమాకు గాను ఫిలిం ఫేర్ అవార్డు కూడా దక్కించుకుంది..

Advertisement

 

ALSO READ:ఆర్జే సూర్య అంతటి కష్టాలను అనుభవించారా ?

ఈమె తన మొదటి సినిమా రితేష్ దేశ్ ముఖ్ సరసన హీరోయిన్ గా చేయడంతో అతడితోనే లవ్లో పడింది. ఆయన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ దేశముఖ్ కుమారుడు రితేష్.. ఇక ఆమె సినిమాల గురించి వ్యక్తిగత జీవితం గురించి ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతునే ఉంటాయి. ఈమె రితేష్ తో చాలా సంవత్సరాలు ప్రేమలో ఉండి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే పెళ్లి అయినా తర్వాత ఒక పండితుడు జెనీలియాకు తాను ఇంతకు ముందే ఒక వ్యక్తితో పెళ్లి చేశానంటూ కేసు పెట్టడం కొసమెరుపు. పంతులు చెప్పింది వాస్తవమే కానీ అది సినిమాలో అని తెలియక పప్పులో కాలేశారట.

Advertisement

2011లో జాన్ అబ్రహంతో ఓ సినిమాలో చేసింది జెనీలియా. ఈ చిత్రం లో పెళ్లి సీన్ ఉంటుంది. అయితే ఈ పెళ్లి సీన్ నిజమైన పెళ్లిలా తలపించాలనే ఉద్దేశంతో చిత్ర యూనిట్ పెళ్లికి సంబంధించినవి అన్ని సాంప్రదాయ బద్ధంగా పూర్తి చేసి నిజమైన పంతులును పిలిపించి పెళ్లి తంతు షూటింగ్ పూర్తి చేసారట. ఈ విషయం తెలియని పంతులు ప్రొడ్యూసర్ ఆఫీస్ కు వెళ్లి జెనీలియా మరో అబ్బాయిని మోసం చేస్తూ పెళ్లి చేసుకుంటుందని గొడవ పెట్టుకున్నాడట.అది నిజమైన పెళ్లి కాదు సినిమా లో అని తెలిసి సైలెంట్ అయ్యారట..

ALSO READ:

Visitors Are Also Reading