Home » మళ్ళీ భారత జట్టు పగ్గాలు అందుకోనున్న దాదా..!

మళ్ళీ భారత జట్టు పగ్గాలు అందుకోనున్న దాదా..!

by Azhar
Ad

ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షపదవిలో ఉన్న సౌరవ్ గంగూలీ.. అంతకముందు క్రికెటర్ గా.. కెప్టెన్ గా భారత జట్టుకి ఎన్ని విజయాలు అందించాడో అందరికి తెలుసు. అయితే ఇప్పుడు మళ్ళీ దాదా భారత జట్టు కి కెప్టెన్ గా వ్యవరించనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ నెల 15వ తేదీకి మన భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తి అవుతుంది. ఈ సందర్భగానే మన ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ నిర్వహిస్తుంది.

Advertisement

ఇందులో భాగంగానే ఇంటింటా జెండా అనే పిలుపుతో వచ్చింది. అదే విధంగా మన దేశంలో క్రికెట్ అనేది ప్రజలకు చాలా ఇష్టమైన ఆట. అందుకే ఇండియా vs రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మ్యాచ్ అనేది నిర్వహించాలని బీసీసీఐని భారత ప్రభుత్వం కోరింది. కానీ కరోనా నుండి కొంత బయటకు వచ్చిన తర్వాత ప్రతి జట్టు తీరిక లేని షెడ్యూల్ అనేది గడుపుతుంది. అందువల్ల ఈ మ్యాచ్ అనేది సాధ్యం కాదు అని బీసీసీఐ పేర్కొంది

Advertisement

కానీ ఈ మ్యాచ్ ను లెజెండ్స్ క్రికెట్ లీగ్ లో నిర్వహిస్తాం అని బీసీసీఐ పేర్కొంది. క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లు అందరూ ఈ లీగ్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే వారిలో ఇండియా vs రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మ్యాచ్ అనేది ఈ నెల 15న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో మన భారత జట్టుకి సౌరవ్ గంగూలీ కెప్టెన్ గా ఉన్నాడు. ఇక ప్రత్యర్థి జట్టుకు ఇయాన్ మోర్గాన్ కెప్టెన్ గా వ్యవరించనున్నాడు.

ఇవి కూడా చదవండి :

మహిళల జట్టుపై అజారుద్దీన్ అనుచిత వ్యాఖ్యలు..!

ధోని జట్టులో ఉండాలి అంటే బ్యాటింగ్ కంటే అదే ముఖ్యమట..!

Visitors Are Also Reading