Home » ప్రపంచ కప్ టీంఇండియా మెంటర్ గా గంభీర్..?

ప్రపంచ కప్ టీంఇండియా మెంటర్ గా గంభీర్..?

by Azhar
Ad
గత ఏడాది యూఏఈ వేదికగా జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్… మళ్ళీ ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్, నవంబర్ లో జరుగుతుంది. దాంతో ఈ టోర్నీకి ఆటగాళ్లను ఎవరిని ఎంపిక చేయాలా.. అని ఆలోచిస్తున్న బీసీసీఐకి ఇప్పుడు ఓ డిమాండ్ వస్తుంది. అదే ఈ జట్టు మెంటర్ గా ప్రపంచ కప్పుల ఫైనల్స్ వీరుడు గౌతమ్ గంభీర్ ను ఎన్నుకోవాలని అంటున్నారు.
అయితే గత ఏడాది ప్రపంచ కప్ కు ధోనిని మెంటర్ గా ఏఎంపిక చేయడం పెద్ద చర్చగా మారింది. కెప్టెన్ గా మూడు ఐసీసీ టైటిల్ అందించిన ధోనిపై మెంటర్ గా కూడా చాలా నమ్మకాలు ఉన్నాయి. కానీ అవి అన్ని అడియాశలు అయ్యాయి. ఈ టోర్నీలో టీం ఇండియా కనీసం సెమీస్ కు కూడా చేరలేదు. ఇక ఈ ఐపీఎల్ 2022 లో కొత్తగా వచ్చినా లక్నో సూపర్ జెంట్స్ ను మెంటర్ గా గంభీర్ నియమితుడయ్యాడు.
ఇక లక్నో కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ పైన ఎవరికీ నమ్మకం లేకపోయినా గంభీర్ పైన చాలా మందికి నమ్మకం ఉండేది. అందుకు తగ్గట్లుగానే మెంటర్ గా లక్నో సాధించిన విజయాల వెనుక.. ఇప్పుడు ఆ జట్టు ఐపీఎల్ 2022 టాపర్ గా నిలవడం వెనుక గంభీర్ ఉన్నాడు అని అందరికి తెలుసు. అందుకే ఈ ప్రపంచ కప్ కూడా గంభీర్ ను మెంటర్ గా నియమిస్తే… కెప్టెన్ రోహిత్ శర్మ.. హెడ్ కోచ్ ద్రావిడ్ అలాగే మెంటర్ గంభీర్ ఆధ్వర్యంలో భారత జట్టు తప్పకుండ కప్పు గెలుస్తుంది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :

Advertisement

Visitors Are Also Reading