Home » కోహ్లీ, రాహుల్ ను అవమానించిన గంభీర్..!

కోహ్లీ, రాహుల్ ను అవమానించిన గంభీర్..!

by Azhar
Ad
భారత మాజీ ఓపెనర్.. ప్రపంచ కప్ ఫైనల్స్ వీరుడు గౌతమ్ గంభీర్ గురించి అందరికి తెలిసిందే. ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న గంభీర్ ఇంకా కూడా తన క్రికెట్ ను వదిలిపెట్టలేదు. ఈ ఐపీఎల్ 2022 సీజన్ లో కొత్తగా వచ్చిన లక్నో సూపర్ జెంట్స్ కట్టుకు మెంటర్ గా వ్యవహరించిన గంభీర్… తనకు ఏం అనిపిస్తే అదే చెబుతాడు అనేది అందరికి తెలుసు. అవతల ఉన్నాది ఎవరైనా సరే తన నిర్ణయాన్ని మాత్రం బల్ల గుద్దినటు చెబుతాడు. అందుకే ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతాడు. ఇక తాజాగా కూడా అదే తరహాలో గంభీర్ కొన్ని వ్యాఖ్యలు చేసాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన గంభీర్ మాట్లాడుతూ… ఈ నవంబర్ లో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ జట్టులో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఉండాలని సూచించాడు. ఐపీఎల్ లో తన లక్నో జట్టు కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ ను ఓపెనర్ గా వద్దు అంటూ పేర్కొన్నాడు. రాహుల్ కంటే కిషన్ ఫియర్లెస్ క్రికెట్ ఆడుతాడని.. అందువల్ల జట్టుకు పవర్ ప్లే లో ఎక్కువ పరుగులు వస్తాయని తెలిపాడు. అందుకే కిషన్ ఓపెనర్ గా రోహిత్ తో జత కట్టాలి అని తెలిపాడు.
అంతే కాకుండా వన్ డౌన్ లో కూడా కోహ్లీ కాకుండా సూర్య కుమార్ యాదవ్ రావాలని గంభీర్ అన్నాడు. అయితే ఈ ఐపీఎల్ లో కోహ్లీ పూర్తిగా విఫలం కాగా.. సూర్య కుమా గాయం కారణంగా మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్ళిపోయాడు. కానీ ఆడిన అన్ని మ్యాచ్ లలో మంచి ప్రదర్శనను కనబరిచాడు. అందుకే వన్ డౌన్ లో కోహ్లీ కాకుండా అతను రావాలని సూచించాడు. దీంతో కోహ్లీ ఫ్యాన్స్ గంభీర్ పై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. వన్ డౌన్ ప్లేస్ కే పేరు తెచ్చిన కోహ్లీకి ఆ స్థానంలో బ్యాటింగ్ కు రాకూడదు అని చెప్పడం ఏంటి అని గంభీర్ ను ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Visitors Are Also Reading