Home » కొత్త ఏడాదిలో ఈ 3 రాశుల వారికి గజలక్ష్మి రాజయోగమే..?

కొత్త ఏడాదిలో ఈ 3 రాశుల వారికి గజలక్ష్మి రాజయోగమే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతిని దేవతల గురువు అని పిలుస్తారు. ఎవరి జాతకంలో అయితే గురుగ్రహం శుభస్థానంలో ఉంటుందో వారు సమాజంలో ఎక్కువ గౌరవ మర్యాదలు పొందుతారు. అయితే 2023 సంవత్సరంలో బృహస్పతి మీనరాశిని వీడి మేషరాశిలోకి ప్రవేశిస్తుంది. దీని కారణంగా గజలక్ష్మి రాజయోగం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఈ యోగం వల్ల అన్ని రాశుల వారిపై ప్రభావం కనిపిస్తుంది. ఈ మూడు రాశుల వారు మాత్రం ఆర్థికంగా బలపడే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా వీరు కెరియర్ లో పురోగతి కూడా సాధిస్తారు. ఆ లక్కీ రాశులు ఏంటో తెలుసుకుందాం..?

Advertisement

also read:Unstoppable With NBK 2 : పవన్ ను విమర్శించే వాళ్ళు ఊర కుక్కలతో సమానం..బాలయ్య సంచలనం

ధనస్సు రాశి :
ఈ రాజకీయ రంగానికి చెందినవారికి గజలక్ష్మి రాజయోగం వల్ల అదృష్టం పట్టి ఆకస్మిక ధన లాభం కలుగుతుందట. ఎందుకంటే బృహస్పతి మీ రాశి నుండి 5వ ఇంటిలో సంచరించబోతాడు. వ్యాపారంలో కూడా అనేక లాభాలు వస్తాయని, విదేశాలకు వెళ్లి చదువుకోవాలని ఉండే కోరిక నెరవేరుతుందట. వీరికి మంచి భవిష్యత్తుతో పాటు లాభాలు అందుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

Advertisement

మిథున రాశి :
ఈ రాశి వారికి గజలక్ష్మి రాజయోగం వల్ల ఆదాయంలో పెరుగుదల ఉంటుందట. ఈ సమయంలో పాత పెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందుతారని అంటున్నారు. అంతేకాకుండా బెట్టింగ్ స్టాక్ మార్కెట్ లాటరీ లాంటి వాటిలో లాభాలు పొందుతారు. బిజినెస్ లో కూడా కొత్త డీల్స్ వస్తాయని, విద్యారంగంలో సంబంధం ఉన్నవారు లాభపడతారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

మేషరాశి:
ఈ రాశి వారు గజలక్ష్మి రాజయోగం వల్ల కొత్త ఏడాదిలో ఆర్థికంగా బలపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. బృహస్పతి మీ రాశి నుండి లగ్నాధిపతి ఇంటికి వెళ్లబోతున్నాడు. దీనివల్ల నిరుద్యోగులు జాబ్ ఆఫర్ ను పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందట.

also read:

Visitors Are Also Reading