Home » సోషల్ మీడియా సెన్సేషన్ గద్వాల్ బిడ్డ మృతి…!

సోషల్ మీడియా సెన్సేషన్ గద్వాల్ బిడ్డ మృతి…!

by AJAY
Ad

సోషల్ మీడియాలో గద్వాల్ బిడ్డగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న మల్లికార్జున్ రెడ్డి అనారోగ్యం తో మృతి చెందాడు. చిన్న తనం నుండి మల్లికార్జున్ ఆస్తమా తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. మల్లికార్జున్ చిన్న వయసులో తెలిసీ తెలియక ఓ వర్గం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆ వీడియో ను యూట్యూబ్ లో షేర్ చేశాడు.

Gadwal bidda mallikarjun reddy no more

Gadwal bidda mallikarjun reddy no more

ఆ వీడియో కాస్తా వైరల్ అయ్యింది. దాంతో ఆ వీడియో ను డిలీట్ చేశారు. కానీ వీడియో లో తాను గద్వాల్ బిడ్డ అని మల్లికార్జున్ చెప్పిన డైలాగ్ నెటిజన్లను ఆకట్టుకుంది. “అది కూడా కరెక్టే కదా సార్” అనే మరో డైలాగ్ తో కూడా మల్లికార్జున్ సోషల్ మీడియాలో పాపులారిటీ ని సంపాదించుకున్నాడు.

Advertisement

Advertisement

తెలిసి తెలియక అమాయకంగా కనిపిస్తూ మల్లికార్జున్ చేసిన డైలాగ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతునే ఉంటాయి. చాలా ట్రోల్స్ వీడియోలు మీమ్స్ లో మల్లికార్జున్ కనిపిస్తూ ఉంటాడు. చిన్న వయసులోనే మల్లికార్జున్ మీమ్స్ ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక చిన్న వయసులోనే గద్వాల్ బిడ్డ గా పాపులర్ అయిన మల్లికార్జున్ మృతి చెందడం తో నెటిజన్లు బాధపడుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటన్నారు.

Visitors Are Also Reading