Home » క్రికెట్ లో ఫుల్ కిక్కేచ్చే మ్యాచ్.. 100లోపే స్కోర్.. 35 రన్స్ తేడాతో విజయం..!

క్రికెట్ లో ఫుల్ కిక్కేచ్చే మ్యాచ్.. 100లోపే స్కోర్.. 35 రన్స్ తేడాతో విజయం..!

by Anji
Ad

సాధారణంగా పొట్టి ఫార్మాట్ లో మ్యాచ్ అంటేనే ఉత్కంఠగా కొనసాగుతుంటుంది. బౌలింగ్ గెలుస్తుందా.. బ్యాటింగ్ గెలుస్తుందా.. ముఖ్యంగా వికెట్ పడ్డప్పుడు విన్ వీరిదేనని.. సిక్స్ లేదా ఫోర్ వచ్చినప్పుడు వీరు అద్భుతంగా ఆడుతున్నారనే టెన్షన్ ఉంటుంది.  ఇది అభిమానుల్లో మరీ ఎక్కువగా టెన్షన్ పెంచేవిధంగా చేస్తుంది. ఇలాంటి ఎన్నో మ్యాచ్ లు మనం చూసే ఉంటాం. తాజాగా దోహాలో జరుగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ మాస్టర్స్ లో ఇలాంటి అద్భుతమైన  మ్యాచ్ కనిపించింది. ఆసియా లయన్స్ వర్సెస్ వరల్డ్ జేయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. 

Also Read :  టాలీవుడ్ లో మరో బంపర్ కొట్టేసిన జాన్వీ కపూర్ !

Advertisement

ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ దొరికింది. ఓవైపు బౌలర్లు వికెట్లు పడేస్తుంటే.. మరోవైపు బ్యాటర్స్ పరుగుల వర్షం కురిపిస్తూనే సందడి చేస్తున్నారు.  ఆసియా లయన్స్ వరల్డ్ జెయింట్స్ మధ్య మ్యాచ్ 10 ఓవర్ల పాటు జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసియా లయన్స్ 10ఓవర్లలో 99 పరుగులు చేసింది. ఇందులో మిస్బా ఉల్ హక్ ఒక్కడే 44 పరుగులు చేశాడు. అతను కేవలం 19 బంతుల్లో 4 ఫోర్లు,  3 సిక్సర్ల సహాయంతో ఈ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. 231 కంటే ఎక్కువగా స్ట్రైక్ రేట్ తో ఆడిన మిస్బా ఈ మెరుపు ఇన్నింగ్స్ కారణంగానే ఆసియా లయన్స్ 100 పరుగులకు చేరువ అయింది. 

Advertisement

Also Read :  అంతర్జాతీయ క్రికెట్ లోనే మొదటి సారి.. పాక్-ఆప్గన్ సిరీస్ లో వెరైటీ రూల్..!

వరల్డ్ జేయింట్స్ 10 ఓవర్లలో 100 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగింది. కానీ అరోన్ ఫించ్ సారథ్యంలోని వరల్డ్ జేయింట్స్ 64 పరుగులకు మించి స్కోరు చేయలేకపోయింది. ముగ్గురు బ్యాట్స్ మెన్స్ ఎక్స్ ట్రాల రూపంలో వచ్చినన్ని పరుగులు కూడా చేయలేకపోవడం గమనార్హం. దీని ఫలితంగా ఆసక్తికరమైన మ్యాచ్ కి అద్భతమైన ముగింపు లభించింది. ఆసియా లయన్స్ 35 పరుగుల తేడాతో వరల్డ్ జేయింట్స్ ని ఓడించింది. మిస్బా ఉల్ హక్ మళ్లీ ఛాంపియన్ ప్లేయర్ గా అవతరించాడు. ఆసియా లయన్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. 

Also Read :  ఐపీఎల్ చరిత్రలో భారీ స్కోర్ చేసి ఓడిపోయిన టాప్ 5 టీమ్ లు ఇవే..!

Visitors Are Also Reading