సూపర్ స్టార్ కృష్ణకు సహజంగా కోపం రాదట. ఆయన షూటింగ్ సమయంలో చాలా జాలీగా పంచ్ లు వేస్తూ అచ్చం మహేశ్ బాబు లానే ఉండేవారని ఆయనతో పనిచేసిన వారు చెబుతూ ఉంటారు. కానీ కోపం వస్తే మాత్రం ఎవరికీ వినేవారు కాదట. అంతే కాకుండా అవతల వాళ్లు ఎంతటి వారైనా వారిని ఎదిరించేవారట. 1984 డిసెంబర్ లో అలాంటి ఘనట ఒకటి జరిగింది. నాందెండ్ల ఎపిసోడ్ ముగిసన తరవాత ఎన్టీరామారావు ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లారు.
Advertisement
ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రెస్ తరపున ప్రచారం చేసేవారు. కృష్ణ ఎన్టీఆర్ పై వేసే పంచ్ లకు ప్రసంగాలకు జనాళ్లో భారీగా రెస్పాన్స్ ఉండేది. కృష్ణ ఎన్నికల ప్రసంగాలన్నీ రచయిత మహారథి రాసేవారు. ఇదిలా ఉంటే అప్పట్లో రామోజీరావు దినపత్రిక ఈనాడు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా వార్తలు రాసేదట. అలాంటి సమయంలో కృష్ణ నంద్యాల సభల ఎన్టీఆర్ ను విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Advertisement
ఈ సభకు భారీ జనాలు తరలి వచ్చారు. అయితే సభ ముగించుకుని ఇంటికి వెళుతుండగా కొందరు యువకులు కృష్ణ పై రాళ్లతో దాడి చేశారు. ఆ దాడిలో ఓ రాయి కృష్ణ కంటికి తగిలింది. దాంతో మరసటి రోజు కృష్ణ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో మరోసారి ఎన్టీఆర్ పై విమర్శలు కురిపించారు. తన పై జరిగిన దాడికి ఈనాడు, టీడీపీ భాధ్యత వహించాలని అన్నారు.
తన సభకు మూడు లక్షలకు పైగా జనాలు వస్తే ఈనాడు పదిహేను వందల మంది మాత్రమే వచ్చినట్టు రాసిందని అన్నారు. ఈనాడు కండ్లు చెవులు మూసుకుపోయాయా అంటూ విమర్శించారు. కాంగ్రెస్ కు ఓటు వేయవద్దని రాసే హక్కు ఈనాడుకు ఎవరు ఇచ్చారు అంటూ మండిపడ్డారు. కృష్ణ చేసిన విమర్శలను ఈనాడు మరుసటి రోజు ఫ్రంట్ పేజీలో ప్రచురించింది. ఆ తరవాత కృష్ణ మరియు రామోజీరావు మధ్య మాటలు లేకుండా పోయాయి.