Home » నెంబర్ వన్ రష్మికనే అంటున్న ఫ్యాన్స్… పూజా హెగ్డే మేనియా తగ్గిందా..!!

నెంబర్ వన్ రష్మికనే అంటున్న ఫ్యాన్స్… పూజా హెగ్డే మేనియా తగ్గిందా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎప్పుడు ఏ హీరో హీరోయిన్, ఏ మూవీ విజయవంతం అవుతుందో మనం చెప్పలేం. ప్రేక్షకులకు నచ్చితే దాన్ని ఎంతో దూరం తీసుకెళతారు. నచ్చకపోతే తీసికింద పడేస్తారు. సముద్రపు అలలు ఏవిధంగా పడిలేస్తూ ఉంటాయో ఆ విధంగానే వీరి సినిమాలలో కూడా సక్సెస్లు, ఫ్లాప్ లు ఉంటాయి. సక్సెస్లు ఉన్నన్ని రోజులు కెరీర్ కి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ వరుస ఫ్లాపులు వస్తే మాత్రం ఇండస్ట్రీలో పని అయిపోయినట్టే. ఈ విధమైన ఫార్ములా ప్రకారమే హీరో హీరోయిన్ల రేటింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది.

Advertisement

 

 

కానీ ప్రస్తుతం నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతున్నటువంటి పూజా హెగ్డే బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ తో ముందుకు పోతోంది. దీంతో చాలా మంది ఫ్యాన్స్ పూజా హెగ్డే సీన్ అయిపోయిందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీ విషయానికి వస్తే రష్మిక మందన్న పూజా హెగ్డే కి మధ్య గట్టి పోటీ నడుస్తోంది. అల వైకుంఠపురం లో, సరిలేరు నీకెవ్వరు సినిమాలకు సంబంధించి కూడా ఇద్దరు కథానాయికలు మధ్య పోటీ వచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో రాదే శ్యాం, బీస్ట్ సినిమాలతో పూజా హెగ్డే కి రెండు ఫెయిల్యూర్స్ వచ్చాయి.

Advertisement

వెంటనే ఈక్వేషన్స్ మారిపోయాయి. అయితే రష్మికా కూడా ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ రూపంలో ఫ్లాప్ వచ్చింది కానీ, పుష్ప సినిమాతో ఆమె పాపులారిటీ రెండు రెట్లు పెరిగిపోయింది. ఇదిలా ఉండగానే పూజా హెగ్డే ప్రస్తుతం రాబోతున్నటువంటి ఆచార్య మూవీ పైన ఆశలు పెట్టుకుంది. ఆచార్య టీజర్ చూసిన వారికీ సినిమాపై పెద్దగా అంచనాలు ప్రకారం ప్రేక్షకులను అలరిస్తుందో లేదో ముందు ముందు మనకు తెలుస్తుంది.. ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత చరణ్ నుండి వస్తున్న మరో మూవీ ఇది. కచ్చితంగా ఆచార్యకు ఆర్ఆర్ఆర్ మూవీ కి పోలిక ఉంటుందని చెప్పవచ్చు.

Visitors Are Also Reading