Home » “సాయిపల్లవిని” అలా చూడలేకపోతున్నామన్న ఫ్యాన్స్.. కారణం తెలిస్తే..?

“సాయిపల్లవిని” అలా చూడలేకపోతున్నామన్న ఫ్యాన్స్.. కారణం తెలిస్తే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్ లలో ఒకరు సాయి పల్లవి. ఈమె తన నటన తో ప్రత్యేక స్టార్డమ్ ను సంపాదించుకుంది. ఆమె హీరోలతో సమానంగా పాత్రలు చేయడం, కొన్ని సినిమాల్లో హీరో కంటే ఎక్కువ సాయి పల్లవి పాత్ర కు ఆదరణ లభించడం వల్లే హిట్ అయ్యాయి. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న సాయిపల్లవి ప్రతి సినిమాలో చలాకీగా, కనిపిస్తూ అందరినీ అలరించేది. ఆ విధంగా చాలా సినిమాల్లో నటించి సక్సెస్ బాట పట్టింది ఈ అమ్మడు.

Advertisement

ఫిదా సినిమా తో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఎంతో ఉత్సాహంగా కనిపించే సాయి పల్లవి ఈ మధ్యకాలంలో ఏడుపుగొట్టు పాత్రల్లో నటిస్తోందని చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చాలా లవ్ స్టోరిస్ సినిమాల్లో సైతం సాయిపల్లవి పాత్రకు సంబంధించి ఎమోషనల్ సీన్లు ఎక్కువగా ఉన్నాయని, తాజాగా వచ్చిన విరాటపర్వం మూవీలో వెన్నెల పాత్రలో ఉన్న సాయి పల్లవి మరణించడం అభిమానులకు ఏమాత్రం నచ్చలేదని కామెంట్లు చేస్తున్నారు. త్వరలో సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన ‘గార్గి’ థియేటర్లలో విడుదల కానుండగా ఈ మూవీ సీరియస్ కథాంశంతో తెరకెక్కనుందని తెలుస్తోంది.

Advertisement

అయితే సాయి పల్లవి ఇకముందైనా ఎమోషనల్ పాత్రలకు దూరంగా ఉండాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా ఉన్న సినిమాలను మాత్రమే ప్రేక్షకులు ఇష్టపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే సాయి పల్లవి కూడా కమర్షియల్ మరియు ఎంటర్టైన్మెంట్ మూవీస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ విధంగా సాయి పల్లవి సరైన పాత్రలు ఎంచుకుంటేనే తన కెరీర్లో ఉన్నత స్థానానికి వెళుతుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ALSO READ:

Visitors Are Also Reading