Home » బాలయ్యకు పెను ప్రమాదం.. హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌

బాలయ్యకు పెను ప్రమాదం.. హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌

by Bunty
Ad

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం వీరసింహారెడ్డి. మైత్రి మూవీ మేకర్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.


కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఒంగోలులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం బాలయ్య ప్రత్యేక హెలికాప్టర్ లో ఒంగోలుకు వెళ్లారు. అంతా బాగానే ఉంది కానీ, రిటర్న్ ప్రయాణంలోనే ప్రమాదం చోటుచేసుకుంది.

Advertisement

Advertisement

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఒంగోలు పిటిసి గ్రౌండ్స్ లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. తన తాజా చిత్రం వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నిన్న ఒంగోలు వెళ్లిన బాలయ్య రాత్రి అక్కడే బస చేశారు. అయితే ఇవాళ ఉదయం ఒంగోలు నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. కానీ, హెలికాప్టర్ బయలుదేరిన 15 నిమిషాలకే వాతావరణం అనుకూలించకపోవడంతో వెనుదిరిగింది. పిటిసి గ్రౌండ్స్ లో అత్యవసరం ల్యాండ్ అయింది. ప్రస్తుతం ఏటిసి క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తోంది హెలికాప్టర్. ఇక, హెలికాప్టర్ కోసం ఒంగోలు పిటిసి గ్రౌండ్స్ లో హీరో నందమూరి బాలకృష్ణ, హీరోయిన్ శృతిహాసన్ తదితరులు వేచి చూస్తున్నారు.

READ ALSO : యాంకర్ శ్రీ ముఖి పెళ్లి ఫిక్స్..ప్రముఖ వ్యాపారవేత్తతో వివాహం ?

Visitors Are Also Reading