Home » ఇండియాను క్యాష్ చేసుకోవాలనుకున్న ఇంగ్లాండ్..!

ఇండియాను క్యాష్ చేసుకోవాలనుకున్న ఇంగ్లాండ్..!

by Azhar
Ad

క్రికెట్ అత్యంత ధనిక బోర్డు ఏది అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అందరూ చెప్పే పేరు బీసీసీఐ.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. ఇక ఐసీసీకి కూడా మన బీసీసీఐ నుండే ఏకువ ఆదాయం వస్తుంది. మన ఇండియాలో క్రికెట్ కు ఎంతో మంది అభిమానులు ఉండటం వల్లే.. బీసీసీఐ బోర్డుకు కూడా పైసల్ ఎక్కువగా వస్తాయి. ఇక ఇండియాలో ఉన్న ఈ అభిమానంనే క్యాష్ చేసుకోవాలని ఇంగ్లాడ్ భావిస్తుంది.

Advertisement

అయితే క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం పెద్ద మ్యాచ్ ఏది అంటే ఇండియా vs పాకిస్థాన్. ఈ రెండు దాయాది దేశాలు ఎప్పుడు తలపడిన ధనిక ఉండే క్రేజ్ వేరే లెవల్ అనే చెప్పాలి. ఇక ఈ రెండు జట్లు తలపడిన ప్రతిసారి కూడా ఆ మ్యాచ్ ను ప్రసారం చేసే బ్రాడ్ కాస్ట్ ఛానెల్స్ కు పండుగే అని చెప్పాలి. ఓ 10 మ్యాచ్ లకు వచ్చే ఆదాయం అంతకంటే ఎక్కువే ఇండియా, పాక్ మ్యాచ్ కు వస్తాయి.

Advertisement

దీని ఉద్దేశంలోనే పెట్టుకొని ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య ఓ టెస్ట్ సిరీస్ మా దేశంలో నిర్వహిస్తాం అని ఇంగ్లాండ్ బోర్డు రెండు దేశాల బోర్డులను సంప్రదించింది. అయితే ఇందుకు రెండు బోర్డులు కూడా నో చెప్పాయి. ఇండియా, పాక్ మధ్య ద్వైపాక్షిక మ్యాచ్ జరిగితే అది ఇండియా లేదా పాక్ దేశాల్లోనే జరగాలి అని పాక్ బోర్డు చెప్పింది. ఇక మన బీసీసీఐ అసలు అలాంటి మ్యాచ్ ఆలోచనే లేదు అని ఇంగ్లాండ్ కు పేర్కొంది.

ఇవి కూడా చదవండి :

హార్ధిక్ వంటి క్రికెటర్ పాక్ జట్టులో ఉన్నాడా..?

షమీ ప్రపంచ కప్ జట్టులోకి రావాల్సిందే..?

Visitors Are Also Reading