Home » దృశ్యం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా..?

దృశ్యం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా..?

by AJAY
Ad

చూస్తుండగానే చైల్డ్ ఆర్టిస్టులు హీరోలు… హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే మన కళ్ళ ముందు పలు చిత్రాల్లో నటించిన చైల్డ్ ఆర్టిస్టులు హీరోలు హీరోయిన్ లుగా ఎంట్రీ ఇచ్చి అభిమానులను సంపాదించుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా దృశ్యం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. వెంకటేష్ హీరోగా దృశ్యం సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మీనా వెంకటేష్ కు భార్యగా నటించింది.

Advertisement

సినిమాలో వెకంటేష్ మీన దంప‌తుల‌కు ఇద్ద‌రు కుమార్తెలు ఉంటారు. అయితే వారిలో చిన్న కూతురుగా మ‌ల‌యాళ చైల్డ్ ఆర్టిస్ట్ ఎస్తేర్ సినిమాలో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. సినిమాలో వెంకటేష్ ను పోలీసులు కొడుతుంటే ఏడుస్తూ నటించే సీన్ లో ఎస్తేర్ త‌న న‌ట‌న‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఇక ఈ సినిమా ఒరిజినల్ లోనూ ఎస్తేర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించగా….. ఆమె న‌ట‌న చూసి తెలుగులో సైతం ఆమెకే అవకాశం కల్పించారు.

Advertisement

ఇక దృశ్యం సినిమా 2014లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చి ఎనిమిదేళ్లు పూర్తయింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎస్తేర్ వయసు కేవలం 12 ఏళ్లు….. కానీ ఇప్పుడు ఆమె వయసు 20 ఏళ్లు. ఎస్తేర్ సోష‌ల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటూ ఫాలోవ‌ర్స్ ను సంపాదించుకుంది.

దృశ్యం పాప స్పీడు చూస్తుంటే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్న‌ట్టు తెలిసిపోతుంది. సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తూ ఎస్తేర్ అభిమానుల‌ను పెంచుకుంటోంది. మ‌రి చైల్డ్ ఆర్టిస్ట్ గా అద‌ర‌గొట్టిన ఎస్తే ర్ ఫ్యూచ‌ర్ లో ఎలాంటి సినిమా అవ‌కాశాల‌ను అందుకుంటుందో చూడాలి.

Visitors Are Also Reading