Home » ర‌ష్యా- చైనా పై ట్రంప్ ఫ‌న్నీ కామెంట్స్‌..!

ర‌ష్యా- చైనా పై ట్రంప్ ఫ‌న్నీ కామెంట్స్‌..!

by Anji
Ad

అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రూటే స‌ప‌రేట్. ట్రంప్ త‌రుచూ ఏదో ఒక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ.. వివాదాల్లో ఉంటుంటాడు. ఇలా అధ్య‌క్ష ప‌ద‌వీలో ఉండి కూడా ప‌లుమార్లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు. తాజాగా మ‌రొక‌సారి ఇలాంటి ఫ‌న్నీ కామెంట్స్ చేశాడు. ఈ సారి ర‌ష్యా, చైనా గురించి మాట్లాడారు ట్రంప్‌.


అమెరికాకు చెందిన ఎఫ్‌-22 విమానాల‌కు చైనా జెండాలు పెట్టుకుని ర‌ష్యాపై బాంబులు వేయాల‌ని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో చైనా కూడా దాడి చేసింద‌ని చెప్పాల‌ని.. దీంతో చైనా, ర‌ష్యాలు యుద్ధం చేస్తే మ‌నం కూర్చొని చూడ‌వ‌చ్చ‌ని ఫ‌న్నీ కామెంట్స్ చేశాడు. నాటో కేవ‌లం కాగితం పులి మాత్ర‌మే అని అభివ‌ర్ణించాడు. రిప‌బ్లిక్ జాతీయ క‌మిటీ మీటింగ్‌లో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై అధికార డెమొక్రాట్లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

Advertisement

Advertisement

ఇటీవ‌ల ఉక్రెయిన్‌, ర‌ష్యా యుద్దానికి అమెరికానే కార‌ణ‌మంటూ వ్యాఖ్య‌లు చేసారు. ఉక్రెయిన్ త‌రువాత టార్గెట్ అయ్యేది తైవానే అని.. చైనా ఎప్ప‌టి నుంచో తైవాన్‌ను స్వాధీనం చేసుకోవాల‌ని చూస్తోంద‌ని.. ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. అమెరికా నాయ‌కుల చేత‌కాని త‌నం వ‌ల్ల‌నే మ‌ర్యాద లేకుండా పోతుంద‌ని వ్యాఖ్యానించాడు ట్రంప్‌.

Also Read :  Revanth Reddy : కేసీఆర్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టే చివ‌రి బ‌డ్జెట్ ఇదే..!

Visitors Are Also Reading