ఈ రోజుల్లో ఎవరికైనా కాస్త తలనొప్పి ఉన్నా, జ్వరం ఉన్నా వెంటనే ఒక డోలో వేసుకుంటే సరిపోతుందనే మాట వచ్చేస్తుంది. ఈ ట్యాబ్లెట్ అంతలా అందరికీ అలవాటు అయింది. ఇక ముఖ్యంగా కరోనా సమయంలో డోలో 650కి క్రేజ్ మామూలుగా లేదు. వాస్తవానికి వైద్యుల సలహా లేకుండా ట్యాబ్లెట్ వేసుకోవడం మంచి కాదు అనే విషయం తెలిసినా.. కొందరు మాత్రం వాడుతుంటారు. కరోనా ట్రీట్మెంట్కు వైద్యులు కూడా ఈ ట్యాబ్లెట్ను సిఫారసు చేస్తున్న విషయం విధితమే.
Advertisement
Advertisement
తాజాగా డోలో 650 ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. కరోనా సమయంలో దేశంలోనే అత్యధికంగా అమ్ముడు పోయిన ట్యాబ్లెట్గా డోలో నిలిచింది. 2020 కరోనా వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఏకంగా 350 కోట్ల డోలో 650 ట్యాబ్లెట్లు అమ్ముడు పోయాయట. ఈ ట్యాబ్లెట్లను మొత్తం పేర్చుకుంటే పోతే ఎవరెస్ట్ పర్వతం కంటే 6వేల రెట్లు ఎక్కువ ఎత్తు ఉంటుందట. కొవిడ్-19కు ముందు ఈ ట్యాబ్లెడ్ సేల్ ఈ స్థాయిలో లేకపోవడం గమనార్హం.
అయితే 2019లో భారత్లో 75 మిలియన్ స్ట్రిప్లడోలో ట్యాబ్లెట్లను విక్రయించగా.. కేవలం 2021 సంవత్సరంలోనే 307 కోట్ల టర్నోవర్ నమోదు కావడం విశేషం. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం భారత్లో అత్యంత ప్రజాధారణ పొంది ట్యాబ్లెట్లో కాల్పోల్ మొదటి వరుసలో ఉండగా.. రెండవస్థానంలో డోలో 650 నిలిచింది. మరొకవైపు ఇటీవలే డోలో 650 ట్యాబ్లెట్పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మీమ్స్ వైరలవుతున్న విషయం తెలిసినదే.