Home » ఏఐజీ ఆసుప‌త్రిలో మ‌హేష్ బాబు త‌ల్లి.. వైద్యులు ఏమ‌న్నారంటే..?

ఏఐజీ ఆసుప‌త్రిలో మ‌హేష్ బాబు త‌ల్లి.. వైద్యులు ఏమ‌న్నారంటే..?

by Anji
Ad

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు త‌ల్లి, సీనియ‌ర్ న‌టుడు కృష్ణ స‌తీమ‌ణి ఇందిరా దేవి గురించి అంద‌రికీ తెలిసిందే. మ‌హేస్ బాబుకి త‌ల్లి అంటే ఎంత ఇష్ట‌మో ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. త‌న త‌ల్లి గురించి మాట్లాడిన‌ప్పుడల్లా మ‌హేష్ బాబు క‌ళ్ల‌లో నీళ్లు తిర‌గ‌డం మనం ఎన్నోసార్లు గ‌మ‌నించి ఉంటాం. మ‌హేష్ బాబు త‌ల్లి ఆరోగ్యం సీరియ‌స్ కావ‌డంతో గ‌చ్చిబౌలిలోని AIG ఆసుప‌త్రిలో చేర్చిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ఆమె ఎమ‌ర్జెన్సీ వార్డులో వెంటిలేట‌ర్ పై చికిత్స పొందుతున్నారు.

Also Read : ఒకప్పటి తార సిల్క్ స్మిత రాసిన చివరి ఉత్తరం..! జీవితంలో అంతటి నరకాన్ని చూసిందో ఆమె మాటలలోనే..!

Advertisement

 

1961లో సూప‌ర్ స్టార్ కృష్ణ ఇందిరాదేవిని పెళ్లి చేసుకున్నారు. మ‌హేష్ బాబుతో పాటు ర‌మేష్ బాబు, మంజుల‌కి జ‌న్మ‌నిచ్చారు ఇందిరాదేవి. 1969లో కృష్ణ విజ‌య నిర్మ‌ల‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. విజ‌య నిర్మ‌లని పెళ్లి చేసుకున్న త‌రువాత ఇందిరాదేవితో దాంప‌త్య జీవితం కొనసాగించారు కృష్ణ‌. విజ‌య‌నిర్మ‌ల భ‌ర్త కృష్ణ గారి సినిమాల వ్య‌వ‌హారాల‌న్నింటిని ద‌గ్గ‌ర ఉండి చూసుకునేవారు. 2019లో విజ‌య నిర్మ‌ల మృతి చెందింది. క‌రోనా స‌మ‌యంలో కృష్ణ పెద్ద కుమారుడు ర‌మేష్ బాబు మృతి చెందారు. ఆ స‌మ‌యంలో మ‌హేష్ బాబు క‌రోనా కార‌ణంగా త‌న అన్న‌ను చివ‌రి సారి చూడ‌లేక‌పోయారు. ఇప్పుడిప్పుడే ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీ నుంచి చ‌నిపోయిన వారి బాధ నుంచి బ‌య‌ట‌ప‌డుతున్న స‌మ‌యంలో ఇందిరాదేవి ఆరోగ్యం సీరియ‌స్ కావ‌డంతో కుటుంబ స‌భ్యుల‌తో పాటు అభిమానులు కంగారు ప‌డుతున్నారు.

Advertisement

Also Read : ఈ ఒక్క కారణం వల్లే చిరంజీవి కృష్ణలను పక్కనబెట్టి.. మోహన్ బాబుతో సినిమా చేశారా..బిగ్ ట్విస్ట్ ఏంటంటే..?

ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్టు వైద్యులు వెల్ల‌డించారు. వెంటిలెట‌ర్ పై ఉంచి ఆమెకు ట్రీట్‌మెంట్ ఇస్తున్న‌ట్టు చెప్పారు. మ‌హేష్ బాబు కూడా ప్ర‌స్తుతం ఏఐజీ ఆసుప‌త్రి వ‌ద్దనే ఉన్నాడు. ప్ర‌స్తుతం ఆమె అప్జ‌ర్వేష‌న్‌లో ఉన్న‌ద‌ని, త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాల‌ను వెల్ల‌డిస్తారు వైద్యులు చెప్పారు. ఇందిరాదేవి ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని తెలిసిన మ‌హేష్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇందిరా దేవి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని చాలా మంది అభిమానులు దేవున్ని ప్రార్థిస్తున్నారు. మ‌హేష్ బాబుకి తల్లి ఇందిరాదేవి అంటే చాలా ఇష్టం అంట‌. మ‌హేష్‌బాబు పిల్ల‌లు సితార‌, గౌత‌మ్‌ల‌కు కూడా నాన్న‌మ్మ అంటే చాలా ఇష్టం. స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా ఆమెతో క‌లిసి స‌ర‌దాగా గ‌డుపుతుంటార‌ట‌.

Also Read : అమ్మో జానీ మాస్టర్ మామూలోడు కాదుగా.. ఎన్ని కోట్లకు అధిపతంటే..?

Visitors Are Also Reading