రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. బాహుబలి సినిమా తరువాత వచ్చిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు రెండు సినిమాలు అభిమానుల అంచనాలను తలకిందులు చేశాయి. ఇక రాధే శ్యామ్ తరువాత ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ప్రభాస్.
Advertisement
ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయోద్యలో ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో భూమి కుంగినా, నింగి చీలినా.. న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం వస్తున్నా.. న్యాయం రెండు పాదాలతోని పది తలల అన్యాయాన్ని అణచివేయడానికి ఆగమనం.. అధర్మ విధ్వంసం అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్లు ఆకట్టుకుంటున్నాయి. ఇక నార్త్ లో ప్రభాస్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
Also Read : గాడ్ఫాదర్లో మరో స్టార్ హీరో.. సీక్రెట్ రివీల్ చేసిన సల్మాన్ ఖాన్..!
Advertisement
బాహుబలి తరువాత విడుదలైన సాహో సినిమా సౌత్ ఆశించిన మేరకు ఆకట్టుకోకపోయినా.. బాలీవుడ్లో మాత్రం సూపర్ హిట్ కావడం విశేషం. ఆదిపురుష్ సినిమాను తెలుగుతో పాటు హిందీ, మలయాళం, తమిళం, కన్నడలో విడుదల చేస్తున్న విషయం విధితమే. అయితే ఈ చిత్రంలో హిందీలో తన పాత్రకు ప్రభాస్ డబ్బింగ్ చెప్పలేదట. నటుడు శరద్ కేల్కర్ ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ పాత్రకు డబ్బింగ్ చెప్పారు. గతంలో బాహుబలి చిత్రం సమయంలో డార్లింగ్ పాత్రకు ఆయనే వాయిస్ ఓవర్ అందించారు. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చితరంలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా , సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ని అక్టోబర్ 2న చిత్ర బృందం విడుదల చేసింది. జనవరి 12, 2023న విడుదలయ్యే ఈ చిత్రం ఎలా ఉంటుందో వేచి చూడాలి.
Also Read : ఆదిపురుష్ అనుకుంటే శక్తి సినిమా తీశారు అంటూ పోస్టర్ పై ట్రోల్స్…!