Home » కొత్త బంగారులోకం సినిమాని మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..?

కొత్త బంగారులోకం సినిమాని మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..?

by Anji
Ad

దిల్ రాజు నిర్మాతగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన కొత్త బంగారు లోకం చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ హీరోగా శ్వేతబసు ప్రసాద్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాలో హీరోగా వరుణ్ సందేశ్ కన్నా ముందే దిల్ రాజు, శ్రీకాంత్ అడ్డాల కలిసి నాగచైతన్యకి ఈ స్టోరీ సెట్ అవుతుందని నాగార్జున గారిని కలిశారట. అయితే అప్పటికే నాగచైతన్య ఇంకా హీరోగా  ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వలేదు. 

Advertisement

అందుకోసం నాగార్జున నాగచైతన్యని ఓ మాస్ సినిమాతో పరిచయం చేయించాలనే ఆలోచనలో ఉన్న ఇది చాలా క్లాస్ సినిమా కదా మాస్ స్టోరీ ఉంటే తీసుకురండి.. మీ బ్యానర్ లోనే సినిమా చేద్దామని చెప్పారట. దీంతో నిర్మాత దిల్ రాజు మరో హీరో కోసం వెతుకుతున్న సమయంలో శేఖర్ కమ్ముల తీసిన హ్యాపీడేస్ సినిమాలో మేయిన్ రోల్ పోషించినటువంటి వరుణ్ సందేశ్ ని చూసి ఇతను అయితే బాగా సెట్ అవుతాడనుకొని దర్శకుడికి చెప్పి అతనికి వరుణ్ సందేశ్ ని చూపించి.. అతడు ఓకే అన్నాక వరుణ్ సందేశ్ ని హీరోగా తీసుకున్నారట.  

Advertisement

Also Read :  రెండో పెళ్లికి రెడీ అంటున్న 7/g బృందావన్ కాలనీ హీరోయిన్..మరీ ఇంత లేటుగా !

Manam News

కొత్త బంగారు లోకం చిన్న సినిమా తెరకెక్కి ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. అలా నాగచైతన్య ఓ మంచి హిట్ సినిమాని మిస్ చేసుకున్నాడు. ఇక ఆ తరువాత దిల్ రాజు బ్యానర్ లోనే  వాసువర్మ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా వచ్చిన జోష్ చిత్రం ఫ్లాప్ అయింది. నాగచైతన్య కొత్త బంగారు లోకం చిత్రంతో ఎంట్రీ ఇస్తే.. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉండేదని ఇప్పటికీ కూడా అభిమానులు బాధపడుతుంటారు.  జోష్ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆ తరువాత వచ్చిన ఏమాయ చేశావే చిత్రంతో హిట్ అందుకున్నాడు. గత ఏడాది విడుదలైన థాంక్యూ సినిమా ఫ్లాప్ అయింది. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ప్రస్తుతం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అదేవిధంగా పరశురాం దర్శకత్వంలో కూడా మరో సినిమా చేసే ప్లాన్ ఉన్నాడు నాగచైతన్య. 

Also Read :   అంబానీ కొడుకు మళ్లీ బరువు పెరగడానికి కారణం ఏంటో తెలుసా! తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే.

Visitors Are Also Reading