Home » “అల వైకుంఠపురములో”ని ఆ అందమైన ఇల్లు ఎవరిదో తెలుసా…? ఎన్ని కోట్లతో కట్టారంటే…!

“అల వైకుంఠపురములో”ని ఆ అందమైన ఇల్లు ఎవరిదో తెలుసా…? ఎన్ని కోట్లతో కట్టారంటే…!

by AJAY
Ad

సినిమాలు సీరియల్స్ లో చూపించే కొన్ని ఇల్లు ప్రేక్షకుల మదిని దొచేస్తాయి. దాంతో ఆ ఇల్లు ఎవరిది అని తెలుసుకోవడానికి ప్రేక్షకులు అరా తీస్తుంటారు. 2020 సంక్రాంతికి విడుదలైన అల వైకుంఠపురములో సినిమా లోని ఇల్లు కూడా ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇంద్రభవనం లా కనిపించిన ఆ ఇంటికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇంటి ముందు భారీ గేట్ ఇంట్లో ఫర్నిచర్….చుట్టూ చెట్లు విశాలమైన ఇంటి ముందు స్థలం ప్రేక్షకులకు బాగా నచ్చేసాయి.

Advertisement

 

అల్లు అర్జున్ కు సైతం ఇల్లు చాలా చాలా నచ్చేసింది అంట. అంతే కాకుండా తాను కూడా అలాంటి ఇంటిని కట్టుకోవాలని బన్నీ అనుకున్నాడట. ఇదిలా ఉండగా ఆ అందమైన ఇల్లు మరెవరిదో కాదు….ఎన్టీవీ ఛైర్మెన్ నరేంద్ర చౌదరి కూతురు రచనా చౌదరి భర్త వాళ్ళదే. ఆ ఇంటి నిర్మాణం కోసం ఏకంగా 100 కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం.

Advertisement

అల వైకుంఠపురం లో సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ నిర్మాత అయిన రాధాకృష్ణ కు ఇంటి యజమానులు బంధువులు అవుతారు. కాగా సినిమా ఆర్ట్ డైరెక్టర్ భారీ ఇంటిని నిర్మించాలని చెప్పడం తో రాధాకృష్ణ ఇల్లు చూపించి అదే ఇంటిని ఫైనల్ చేశారు. ఇక ఈ ఇంటికి బయట ఉండే కొన్ని సీన్ల కోసం 5 కోట్లతో అన్నపూర్ణ స్టడియోలో సెట్ వేసి తీసినట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి : ఎన్టీఆర్ జీవితంలో మ‌న‌కు తెలియ‌ని ఇన్ని అవ‌మానాలు ఎదుర్కున్నాడా.?

సినిమాలో ఈ భారీ ఇంటిలో టబు ఫ్యామిలీ అంటే అల్లు అర్జున్ అసలైన పేరెంట్స్ ఉంటారు. సినిమా ప్రారంభం లోనే అల్లు అర్జున్ ఈ ఇంటిలో అడుగుపెడతాడు. అప్పుడు ఇంటి గేట్ ను చూపిస్తారు. ఆ తరవాత ఇంట్లో చాలా సన్నివేశాలు ఉంటాయి. అంతే కాకుండా ఈ ఇంటిలో తీసిన సీన్ లు ఎంతో అందంగా కనిపించాయి. ఇక సంక్రాంతి బరిలోకి దిగిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. సినిమాలో ఫైట్స్, అల్లు అర్జున్ డ్యాన్స్, పూజ హెగ్డే పర్ఫామెన్స్ ఇలా చాలా చెప్పుకోదగ్గ విషయాలు ఉన్నాయి.

Also Read:  ఒక అమ్మాయిని ప్రేమించి ప‌క్క‌న ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న అనిల్ రావిపూడి ల‌వ్ స్టోరీ గురించి మీకు తెలుసా..?

Visitors Are Also Reading