Home » ‘ఆరుగురు పతివ్రతలు’ సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎక్కడ ఉందో..ఇప్పుడు ఆ పనులు చేస్తుందా ?

‘ఆరుగురు పతివ్రతలు’ సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎక్కడ ఉందో..ఇప్పుడు ఆ పనులు చేస్తుందా ?

by Bunty
Ad

తెలుగులో ప్రముఖ స్వర్గీయ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ 2004వ సంవత్సరంలో తెరకెక్కించిన “ఆరుగురు ప్రతివ్రతలు” అనే చిత్రం సినీ ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుఉంటుంది. ఇందులో భాగంగా ఈ చిత్రంలోని సన్నివేశాలు ఇప్పటికీ సినీ ప్రేక్షకులను బాగానే అలరిస్తుంటాయి. కాగా ఈ చిత్రంలో అమృత, విద్య, నీత, ఎల్.బి.శ్రీరామ్, చలపతిరావు, రవివర్మ, అజయ్, రాజ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

Advertisement

అయితే ఈ చిత్రంలో ఇద్దరు మొగుళ్ళతో కలిసి కాపురం చేసేటువంటి వివాహిత పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ‘అమృత’ ఇప్పటికీ సినీ ప్రేక్షకులకు బాగానే గుర్తుంటుంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత అమృత తెలుగు సినిమాలకు దూరమయ్యారు. బహుశా ఆమె మొదటి సినిమాలో నటించిన తరహాలోనే తదుపరి సినిమాలో పాత్రలు రావడంతో తాను దూరం అయ్యారని తెలుస్తోంది. ఇక ఈమె సినీ కెరీర్లో అన్ని భాషల్లో కలిపి కేవలం 10 సినిమాలలో మాత్రమే నటించారు.

Advertisement

ఈ విధంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే వెండితెరకు దూరమైన అమృత, ప్రస్తుతం ఏం చేస్తుందనే విషయానికి వస్తే, వెండితెరకు దూరమైన ఈమె వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. దీంతో పూర్తిగా సినిమాలకు దూరమై పూర్తిగా దాంపత్య జీవితంలో ఉన్నటువంటి అమృత బెంగుళూరులో గృహిణిగా స్థిరపడినట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఒక్క సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకొని అనుకోకుండా సినిమా పరిశ్రమకు దూరమైన నటీనటులలో అమృత మిగిలిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

READ ALSO : ఆస్పత్రి బెడ్‌ పైన ఉన్న పంత్‌ కు BCCI శుభవార్త..రూ.21 కోట్లు ఇవ్వాలని నిర్ణయం!

Visitors Are Also Reading