Home » కృతిశెట్టి హీరోయిన్ అవ్వడం కోసం ఆమె తల్లి చేసిన త్యాగం గురించి వింటే ఆశ్చర్యపోతారు..!

కృతిశెట్టి హీరోయిన్ అవ్వడం కోసం ఆమె తల్లి చేసిన త్యాగం గురించి వింటే ఆశ్చర్యపోతారు..!

by Anji
Published: Last Updated on
Ad

ఉప్పెన సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయింది కృతి శెట్టి. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో ఈమె రేంజ్ టాలీవుడ్ లో అమాంతం పెరిగిపోయింది. ఈ చిత్రం తర్వాత మరో రెండు సినిమాలు వరుసగా హిట్ కావడంతో టాప్ హీరోయిన్ల జాబితాలో కృతి పేరు చేరింది. వాస్తవానికి కృతి శెట్టి చిన్ననాటి నుంచి హీరోయిన్ అవ్వాలని అనుకోలేదు. ముంబైలో చదువుకునేది. చదువుకుంటున్న సమయంలోనే ఎక్కువగా కమర్షియల్ యాడ్స్ లో కనిపించింది. ఆమెకు హిందీ సినిమాల్లో నటించే అవకాశం లభించింది.

మొదట ఆమె హిందీలో సూపర్ 30 లో స్టూడెంట్ గా నటించింది. తర్వాత బేబమ్మగా మన తెలుగు తెరకి పరిచయం అయింది. ఒకసారి టాలీవుడ్ లో సెటిల్ అయిన తర్వాత ఆమె శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు లాంటి సినిమాల్లో నటించింది. హీరోయిన్ గా ఎదగడంలో ఆమె కుటుంబం చేసిన త్యాగం ఎంతగానో ఉందని వార్తలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. 2003 సంవత్సరంలో ముంబైలో పుట్టిన శెట్టి తులు ఫ్యామిలీ కి చెందిన అమ్మాయి. కర్ణాటకలోని మంగళూరు వాస్తవ్యులు.

Advertisement

Advertisement

Also Read :  అక్కినేని ఫ్యామిలీ గురించి సమంత ఏముందో తెలుసా ?


తన తండ్రి వ్యాపార రిత్యా ముంబైకి వచ్చే సెటిల్ అయ్యాడు. ఆమె తల్లి ఫ్యాషన్ డిజైనర్ కృతికి ఒక తమ్ముడు, చెల్లి కూడా ఉన్నారు. ముంబైలో పెరిగిన కృతి సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. వరుసగా అవకాశాలు రావడంతో కృతి శెట్టి తన తల్లి ఫ్యాషన్ డిజైనర్ గా చేస్తున్న జాబు ని కూడా వదిలేసిందట. ఎక్కడికి వెళ్ళినా కూడా తనతో పాటు తల్లిని కూడా తీసుకెళ్తుంది. తన తల్లి కెరియర్ సైతం కోల్పోయి తనను హీరోయిన్ గా చేసిందంటూ ఇటీవల ఫంక్షన్ లో కృతి చెట్టి వెల్లడించింది. చాలామంది కృతి తల్లి చేసిన పనికి శభాష్ అంటున్నారు. అది కూడా వరుస సినిమాల్లో కనిపించిన కృతి శెట్టి ప్రస్తుతం మూడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది.

Also Read :  పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన పూర్ణ.. నెటిజన్స్ ఆశ్చర్యం..!

Visitors Are Also Reading