Home » సీతారామం మూవీని మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?

సీతారామం మూవీని మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

హీరో దుల్కర్ సల్మాన్ చేసిన ప్రతి సినిమా హిట్ అవుతూ వస్తోంది. తెలుగులో మొదటి సారి మహానటి మూవీ తో మంచి హిట్ సాధించిన ఆయన తెలుగు అభిమానుల గుండెల్లో మంచి అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో, ఇక అప్పటి నుంచి చాలా వరకూ ఆయన సినిమా తెలుగులో డబ్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ సీతారామం అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Advertisement

ఈ మూవీకి హను రాఘవపూడి దర్శకత్వం వహించగా మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. రొమాంటిక్ లవ్ స్టోరీ తో ప్రేక్షకుల గుండెల్ని కొల్లగొట్టింది. ఈ మూవీ తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా యావత్ సౌత్ ఇండియాలో కూడా మంచి గుర్తింపు సంపాదించింది. ఈ మూవీలో సీత పాత్రలో నటించిన మృణాల్ ఠాకూర్ గురించి చాలామంది మాట్లాడుతున్నారు. ఈ సినిమాలో నటించడం ఆమె అదృష్టం గా భావిస్తున్నారు.

Advertisement

అయితే ఈ సినిమాలో ముందుగా మృణాల్ ఠాకూర్ కాకుండా పూజా హెగ్డే ను హీరోయిన్ గా సెలక్ట్ చేశారు. ప్రొడక్షన్ పనులు అయిన తర్వాత షూటింగ్ మొదలవ్వడానికి ముందు పూజా హెగ్డే కరోనా బారిన పడడంతో ఈ మూవీ నుంచి తప్పించారని వచ్చింది. అప్పటికే సినిమాకు సంబంధించి బడ్జెట్ పెరిగిపోవడంతో చేసేది ఏమీ లేక మృణాల్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. దీంతో ఈ సినిమా హిట్టవడంతో మంచి లవ్ స్టోరి నీ పూజ మిస్ చేసుకుందని అనుకుంటున్నారు.

ALSO READ;

Visitors Are Also Reading