Home » హీరోయిన్ త్రిష కోసం ఆ ఇద్దరు స్టార్ హీరోలు చొక్కాలు పట్టుకొని కొట్టుకున్నారని మీకు తెలుసా..?

హీరోయిన్ త్రిష కోసం ఆ ఇద్దరు స్టార్ హీరోలు చొక్కాలు పట్టుకొని కొట్టుకున్నారని మీకు తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత పది సంవత్సరాల నుంచి ఎంతో మంది హీరోయిన్లు వస్తున్నారు పోతున్నారు. కానీ హీరోయిన్ త్రిష మాత్రం వచ్చింది మొదలు 15 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ గా ఏలుతోంది. అలాంటి త్రిష వర్షం సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకొని ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదని చెప్పవచ్చు. అయితే ఈ హీరోయిన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. అప్పట్లో త్రిష కోసం ప్రభాస్ మరియు గోపీచంద్ విపరీతంగా కొట్టుకున్నారట. ఈ విషయాన్ని గోపీచంద్ బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో బయటపెట్టారు.. అసలు విషయం ఏంటో చూద్దాం..

Advertisement

also read:‘వారసుడు’ రిలీజ్‌కు ముందే విషాదం.. మూవీ ఆర్ట్‌ డైరెక్టర్‌ మృతి!

Advertisement

అన్ స్టాపబుల్ టాక్ షోకు ప్రభాస్ గోపీచంద్ గెస్టులుగా వచ్చారు. ఈ షో కి సంబంధించి ఇప్పటికే మొదటి పార్ట్ బయటకు వచ్చింది. రెండో పార్ట్ కూడా ఈరోజు రాబోతోంది. అయితే దీనికి సంబంధించి ఒక ప్రోమోలో గోపీచంద్ ఒక హీరోయిన్ కోసం మేమిద్దరం గొడవ పడ్డామని చెప్పాడు. దీంతో ఈ విషయం వైరల్ గా మారింది. మరి ఆ హీరోయిన్ ఎవరని బాలయ్య అడిగితే. త్రిష అని టక్కున చెప్పేసాడు గోపీచంద్. ఈ పేరు చెప్పగానే ప్రభాస్ బాలకృష్ణ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

వెంటనే ప్రభాస్ మనం ఎప్పుడు కొట్టుకున్నాం రా అంటూ గోపీచంద్ వైపు చూసాడు. దీంతో గోపీచంద్ సమాధానం ఇస్తూ.. ప్రభాస్ హీరోగా నేను విలన్ గా వర్షం సినిమా వచ్చింది. ఇందులో హీరోయిన్ త్రిష కోసం షూటింగ్ చేసే సమయంలో కొట్టుకున్నామంటూ సమాధానం ఇచ్చారు. గోపీచంద్ ఇలా అనేసరికి బాలకృష్ణ నీ ఒంగోలు తెలివితేటలు నా వద్ద చూపించకు అంటూ సెటైర్ ఇచ్చాడు. అయితే దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

also read:

Visitors Are Also Reading