Home » మీన భర్త విద్యాసాగర్ చివరి రోజులు ఎలా గడిచాయో తెలుసా ?

మీన భర్త విద్యాసాగర్ చివరి రోజులు ఎలా గడిచాయో తెలుసా ?

by Anji
Ad

చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ కెరీర్ ని ప్రారంభించి.. ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి ప్రస్తుతం తల్లి పాత్రలను పోషిస్తుంది మీన. మరో విశేషం ఏంటంటే మీన తల్లి రాజా మల్లికా సైతం నటి కావడం విశేషం. చిన్నప్పటి నుంచే పెద్ద హీరోయిన్ అవ్వాలని మీనా కలలు కని చిన్నతనం నుంచే నటి కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ లో ముందుకు సాగింది. తమిళ సినిమాల్లోనే తొలత బిజీ అయిన మీన ఆ తర్వాత సౌత్ లో అన్ని భాషల్లో బిజీ ఆర్టిస్ట్ గా మారింది. మీన కూతురు నైనికా కూడా నటి అవ్వాలని మీనా కోరిక. అందుకు అనుగుణంగా నైనికా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం మాత్రమే కాదు. తన మొదటి సినిమాకే అవార్డు కూడా అందుకుంది.

Also Read : పవన్ కళ్యాణ్ మూవీకి కొడాలి నాని డిస్ట్రిబ్యూట్ చేశాడు.. అది ఏదో తెలుసా ?

Advertisement

Manam

అయితే తన కూతురు నటి కావడం మీనాకు ఎంతో ఇష్టం అయినప్పటికీ ఆమె భర్త విద్యాసాగర్ కి మాత్రం ఇది నచ్చలేదు.విద్యాసాగర్ సాఫ్ట్ వేర్ ప్రొఫేషనల్ గా ఉంటూ అతి సాధారణ జీవితం గడపడానికి ఇష్టపడ్డాడు. ఒకటి రెండు సినిమాల్లో కూతురి చేత వేషాలు వేయించడానికి ఒప్పుకున్న, ఆ తర్వాత మీనాతో తన కూతురు భవిష్యత్ లో నటి కావడం తనకు ఇష్టం లేదు అని గట్టిగా చెప్పేసాడు. కానీ మీనా అందుకు సిద్ధంగా లేకపోవడంతో అసలు సమస్య మొదలైంది. మీనా, విద్యాసాగర్ లు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కానీ వీరి మధ్య నటన చిచ్చు పెట్టింది. తన భార్య అప్పటికే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతుంది. ఆమె మాత్రమే కాకుండా కూతుర్ని కూడా బిజీ చేయాలనే ఆలోచన ఆమెకు ఉండటం విద్యాసాగర్ కి నచ్చలేదు. దీంతో కూతురితో పాటు మీనాను సైతం నటన నుంచి దూరంగా ఉంచాలని భావించారు.

Advertisement

Also Read : తక్కువ ఖర్చుతో నిర్మాతలను కోటీశ్వరులు చేసిన సినిమాలు ఇవే..!

Manam

ఒక్కసారి లైన్ లైట్ లో బ్రతకడం అలవాటైన తర్వాత ఆ సెలబ్రిటీ స్టేటస్ లేకుండా ఉండటం సాధ్యం కాదు. ఆమె సినిమాల్లో నటించాలని కుతూహలంతోనే ఉండేది. మరోవైపు నైనికా కు కూడా అవకాశాలు వస్తూ ఉండటం మీనా చెప్పిన వినకపోవడంతో విసుగు చెందిన విద్యసాగర్ తన కుటుంబం నుంచి దూరంగా ఉండడం మొదలుపెట్టాడు. అలాగైనా వారు మారతారు అని భావించాడు. లేదంటే విడాకులు తీసుకుని విడిపోవాలని ఆలోచనలో కూడా ఉన్నట్టు సమాచారం. అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈరోజు విడిపోయిన సరే ఎవరి జీవితాల్లో వారు సంతోషంగా ఉండేవారు అని ఊహగానాలు వినిపిస్తున్నాయి.

Manamకానీ అనారోగ్యం విద్యాసాగర్ ని బలి తీసుకుంది. కుటుంబంతో చివరి క్షణాలు గడపకుండానే ఈ లోకాన్ని విడిచి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు.చివరికి మీనా అన్ని తానై అంత్యక్రియలు జరపాల్సిన పరిస్థితి వచ్చింది. కుటుంబంతో ఆఖరి రోజులు ఆనందంగా గడపకపోయినా వారి చేతుల మీదుగానే అన్ని కార్యక్రమాలు జరిగాయి. ఒకరకంగా విద్యాసాగర్ మరణానికి మీనా సైతం బాధ్యత వహించాల్సిందే అనేది ఇండస్ట్రీలో వార్తలు వినిపించడం గమనార్హం. కుటుంబమంతా ఒకచోట ఉండి ఉంటే అనారోగ్యానికి గురైన కొన్ని రోజులకే ఆరోగ్యం కుదుటపడేది. కానీ ఒంటరితనం అతడిని కృంగదీయడంతోనే విద్యాసాగర్ చనిపోయాడని టాక్.

Also Read : పుట్టపర్తి సాయిబాబాపై ఎన్టీఆర్ కోర్టుకు వెళ్లారనే విషయం మీకు తెలుసా ?

 

Visitors Are Also Reading