Home » ముగ్గురు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఆ దర్శకుడు ఎలా చనిపోయాడో తెలుసా ?

ముగ్గురు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఆ దర్శకుడు ఎలా చనిపోయాడో తెలుసా ?

by Anji
Ad

తెలుగులో స్టార్ హీరోలు అయినటువంటి ప్రభాస్, మహేష్ బాబు, రవితేజ వంటి హీరోలు ఇండస్ట్రీలో చాలా హిట్ సినిమాలను తీశారు. అదేవిధంగా వాళ్ల సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను కూడా షేక్ చేశారు. ఇక వీరి సినిమాలు అంటే జనాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇప్పటికే ప్రభాస్ బాహుబలితో పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు సంపాదించుకున్నారు. మహేష్ బాబు కూడా రాజమౌళి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకునే అవకాశముంది. వీరిద్దరూ కూడా కెరీర్ ప్రారంభంలో కొందరూ దర్శకులతో సినిమాలు తీశారు. 

Also Read :  Sir Movie : సార్ మూవీ ఓటింగ్ డేట్ లాక్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Advertisement

అందులో ఒక దర్శకుడు మాత్రం ప్రస్తుతం ఇండస్ట్రీలో లేరు. ఎందుకు అంటే.. ఆయన చాలా చిన్న ఏజ్ లోనే ప్రాణాలను వదలాల్సి వచ్చింది. ఆ దర్శకుడు మరెవ్వరో కాదు.. శోభన్. మహేష్ బాబుతో బాబీ సినిమాని తెరకెక్కించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ గా నిలిచింది. ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్ గా ప్రభాస్ హీరోగా వర్షం చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ప్రభాస్ సినీ కెరీర్ లో కూడా వచ్చిన మొదటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా వర్షం అనే చెప్పాలి.

Advertisement

Also Read :   Rana Naidu: ఒక్క వెబ్ సిరీస్ తో వెంకటేష్ 30 ఏళ్ల కెరీర్ నాశనం అయ్యిందా?

Manam News

ఈ చిత్రం తరువాత దర్శకుడు శోభన్ రవితేజ హీరోగా చంటి సినిమా వచ్చింది. ఈ సినిమా యావరేజ్ గా ఆడినప్పటికీ.. ఈ చిత్రం తరువాత మరో సినిమా తీసే పనుల్లో ఉండగానే అకస్మాత్తు హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో అక్కడ ఉన్న వారు ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అలా ముగ్గురు స్టార్ హీరోలతో హిట్ సినిమాలను తీసిన శోభన్ మధ్యలోనే ప్రాణాలను కోల్పోవడం ఇండస్ట్రీకి తీవ్రమైన నష్టమనే చెప్పాలి. ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్న సంతోష్ శోభన్ దర్శకుడు శోభన్ కుమారుడే. ఆయన తెలుగులో సినిమాలను చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు.  

Also Read :  రాజమౌళిని డైరెక్టర్ గా కాకుండా హీరో చేయాలని అనుకున్నారా? దీని వెనుక ఉంది ఎవరు?

Visitors Are Also Reading