Home » హీరో నాగ శౌర్య ఎంత కట్నం తీసుకున్నారో తెలుసా..?

హీరో నాగ శౌర్య ఎంత కట్నం తీసుకున్నారో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్నటువంటి వారిలో హీరో నాగశౌర్య కూడా ఒకరు. ఇక తాజాగా ఆయన కూడా ఓ ఇంటి వాడయ్యారు. తను ప్రేమించిన అనూష శెట్టి మెడలో మూడు ముళ్ళు వేసి తన భార్యను చేసుకున్నాడు. అలాంటి నాగశౌర్య పెళ్లి గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అనేక వార్తలు పుంకాను పుంకాలుగా వస్తున్నాయి. ఈ తరుణంలోనే ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అదేంటయ్యా అంటే హీరో నాగ శౌర్య కట్న కానుకల విషయం.. మరి ఆయన ఎంత కట్నం తీసుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.

Advertisement

ALSO READ;వైరల్ అవుతున్న శ్రీకాంత్ – ఊహ విడాకుల వార్తలు….ఇందులో నిజం ఎంత..?

నాగశౌర్య వివాహం చేసుకున్న అనూష శెట్టి బెంగళూరులో ఒక ఇంటీరియర్ డిజైనర్ కంపెనీ నడుపుతోంది. కొందరు కామన్ ఫ్రెండ్స్ ద్వారా వీరికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారడం ఇది కాస్త పెద్దల వరకు వెళ్లి పెళ్లికి దారితీసింది. దీంతో ఇద్దరు ఒక్కటైపోయారు. అయితే పెళ్లి సందర్భంగా నాగశౌర్యకు భారీ కట్నకానుకలు కూడా అందాయని తెలుస్తోంది. అనూష శెట్టి స్వగ్రామం మంగళూరు దగ్గరలోని కుందాపుర్.అనూష తండ్రి ఆమె చిన్నప్పుడే బెంగళూరు వచ్చి అనేక వ్యాపారాలు చేస్తూ సెట్ అయిపోయారు. ఆయన కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించినట్లు తెలుస్తోంది.

Advertisement

ఇప్పటికే అనూష తండ్రి పలు వ్యాపారాలు చేస్తున్నారట. అంతేకాకుండా అనూష శెట్టి ఇంటీరియర్ వ్యాపారం కూడా కోట్ల టర్నోవర్ ఉంటుందని సమాచారం. అయితే వివాహం సందర్భంగా నాగశౌర్యకు ఎలాంటి నగదు కట్నం ఇవ్వలేదు. కానీ అనూష శెట్టి పేరు మీద ఉన్న ఆస్తులను, నాగశౌర్య పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఆస్తుల విలువ 50 నుంచి 80 కోట్ల దాకా ఉంటుందని టాక్.. ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు కానీ ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం నాగశౌర్య చేతినిండా సినిమాలతో ఉన్నారు.ఈ సినిమాలు హిట్ కొట్టాలని భావిద్దాం..

ALSO READ;యాంకర్ అనిత చౌదరికి హీరో శ్రీకాంత్ మధ్య రిలేషన్ ఏంటంటే..?

Visitors Are Also Reading