Home » ఒకేరోజు ఒకే స్టోరీ లైన్‌తో విడుద‌లైన బాల‌కృష్ణ‌, వెంక‌టేష్ సినిమాల గురించి మీకు తెలుసా..?

ఒకేరోజు ఒకే స్టోరీ లైన్‌తో విడుద‌లైన బాల‌కృష్ణ‌, వెంక‌టేష్ సినిమాల గురించి మీకు తెలుసా..?

by Anji
Ad

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌, విక్టరీ వెంక‌టేష్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఎన్టీఆర్ న‌ట‌వార‌సుడిగా అడుగుపెట్టి హీరోగా ఆయ‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అటు నిర్మాత డి.రామానాయుడు వార‌సుడిగా హీరోగా తెలుగు సినీ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టిన వెంక‌టేష్ హీరోగా ఆయ‌న కంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరూ ప‌లు సంద‌ర్భాల్లో బాక్సాఫీస్ వ‌ద్ద ఒక‌రి సినిమాలతో మ‌రొక‌రు పోటీప‌డ్డారు. ఒకేరోజు ఒక త‌ర‌హా క‌థ‌లో విడుద‌లైన బాల‌కృష్ణ‌, వెంక‌టేష్ న‌టించిన సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


అప్ప‌ట్లో పెద్ద హీరోల సినిమాలు ఒకే రోజు విడుద‌ల‌య్యేవి. బాలకృష్ణ‌, వెంక‌టేష్ ఇద్ద‌రూ ఒకే త‌ర‌హా స్టోరీతో ఒకేరోజు బాక్సాఫీస్ వ‌ద్ద‌బ‌రిలో దిగారు. ఈ రెండు సినిమాలు విడుద‌లై 33 సంవ‌త్స‌రాలు పూర్త‌వుతోంది. ఆ సినిమాలు ఒక‌టి అశోక చ‌క్ర‌వ‌ర్తి కాగా.. మ‌రొక‌టి ధ్రువ‌న‌క్ష‌త్రం. అశోక చ‌క్ర‌వ‌ర్తి సినిమా విష‌యానికొస్తే.. మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ హీరోగా న‌టించిన ఆర్య‌న్ సినిమాకు రీమెక్‌. ఈ చిత్రాన్ని ఎస్‌.ఎస్‌.ర‌విచంద్ర డైరెక్ట్ చేశారు. ముంబ‌యి మాఫియా బ్యాక్ డ్రాప్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా 1989 జూన్ 29న విడుద‌ల అయింది. మ‌రొక వైపు వెంక‌టేష్ హీరోగా ధ్రువ‌న‌క్ష‌త్రం సినిమా కూడా దాదాపు మాఫియా బ్యాక్ డ్రాప్‌లో వై.నాగేశ్వ‌ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించింది. ఈ చిత్రానికి కూడా దాదాపు మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ ఆర్య‌న్ సినిమాను ప్రేర‌ణ‌గా తీసుకొని తెర‌కెక్కించారు. ఈ సినిమా 1989 జూన్ 29న విడుద‌ల‌వ్వ‌డం విశేషం.

Advertisement

Advertisement


మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ ఆర్య‌న్ మూవీని అధికారికంగా రీమెక్ చేసిని చిత్రం మాత్రం అశోక చ‌క్ర‌వ‌ర్తి. ఈ చిత్రంతో బాలీవుడ్ న‌టుడు శ‌ర‌త్ స‌క్సేనా టాలీవుడ్‌ ఇండ‌స్ట్రీకి అడుగుపెట్టారు. బాల‌కృష్ణ స‌ర‌స‌న భాను ప్రియ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రానికి ఇళ‌య‌రాజా సంగీతం అందించారు. ఇక ధ్రువ‌న‌క్ష‌త్రం సినిమాలో వెంక‌టేష్ స‌ర‌స‌న ర‌జినీ హీరోయిన్‌గా న‌టించింది. వై.నాగేశ్వ‌ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి చ‌క్ర‌వ‌ర్తి సంగీత‌మందించారు. రామానాయుడు మేన‌ల్లుడు అశోక్ కుమార్ నిర్మించారు. ఈ రెండు సినిమాల‌కు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ డైలాగ్స్ అందించడం విశేషం. ఒకే త‌ర‌హా క‌థ‌ను ఇద్ద‌రు హీరోల‌తో తెర‌కెక్కించ‌డం.. ఆ సినిమాలు రెండు కూడా ఒకే రోజు విడుద‌ల‌వ్వ‌డం, వాటికి మాట‌లు రాసిన ర‌చ‌యిత ఒక‌రే కావ‌డం మ‌రొక వింత విచిత్ర‌మ‌నే అనే చెప్పాలి. మొత్తానికి ఈ రెండు సినిమాల్లో వెంక‌టేష్ న‌టించిన ధృవ న‌క్ష‌త్రం సినిమా హిట్ కాగా.. బాల‌కృష్ణ న‌టించిన అశోక చ‌క్ర‌వ‌ర్తి యావ‌రేజ్‌గా ఆడింది.

Also Read : 

న‌టి కె.ఆర్ విజ‌య కూతురు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అన్న సంగ‌తి తెలుసా..? ఆమె ఎవ‌రంటే..!

మా బ‌ట్ట‌ల గురించి మీకెందుకు మీరెమైనా డ‌బ్బులిస్తున్నారా..? నెటిజ‌న్ల‌కు సుప్రీత స్ట్రాంగ్ కౌంట‌ర్..!

 

Visitors Are Also Reading