Home » ఆచార్య చిత్రంపై ద‌ర్శ‌కుడు కొర‌టాల కామెంట్స్ వైర‌ల్‌..ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసిన అభిమానులు

ఆచార్య చిత్రంపై ద‌ర్శ‌కుడు కొర‌టాల కామెంట్స్ వైర‌ల్‌..ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసిన అభిమానులు

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ కలిసి నటిస్తున్న చిత్రం ఆచార్య. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆచార్య దర్శకుడు కొరటాల శివ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మల్టీ స్టారర్ మూవీ కావడంతో ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇటీవలే రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మల్టీ స్టారర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆచార్య కూడా ఆరెంజ్ లోనే ఉంటుంద‌ని అందరూ అభిప్రాయపడ్డారు.


కానీ కొరటాల శివ చివరిక్షణంలో ఆచార్య సినిమా పాన్ ఇండియా రేంజ్ కాదని అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆచార్య సినిమా ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు కొరటాల తో పాటు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డే పాల్గొని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇక మెగా హీరోలకు మల్టీస్టారర్ రేంజ్ లేకపోవడం ఏంటని అభిమానులు చర్చించుకోవడం మొదలు పెట్టారు.

Advertisement

Advertisement


వాస్తవానికి ఆచార్య చిత్రాన్ని అంత పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల చేయాలని చెప్పుకొచ్చిన కొరటాల శివ ఆ తర్వాత కరోనా మహమ్మారి తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం సమయం సరిపోలేదట. ఈ తరుణంలోనే హీరోయిన్ కాజల్ తప్పుకోవడం సహా పలు కీలక మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఆ చిత్రాన్ని కేవలం ప్రాంతీయ చిత్రంగానే విడుదల చేయాలని డిసైడ్ అయినట్టు డైరెక్టర్ తెలిపారు. మిగతా భాషల్లో డబ్బింగ్ చేసే సమయం కూడా దొరకలేదని.. అదేవిధంగా బడ్జెట్ సమస్య కూడా అడ్డు వచ్చిందని తెలుస్తోంది. ఇక‌ ఏప్రిల్ 29న విడుదలయ్యే ఆచార్య సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది గంటల సమయమే వేచి చూడాలి.

Also Read : 

మ‌హేష్ అభిమానుల‌కు శుభ‌వార్త‌.. స‌ర్కారు వారి పాట ట్రైల‌ర్ ఎప్పుడంటే..?

ఆ హీరో నాతో బెడ్ షేర్ చేసుకున్నాడు….త‌మిళ స్టార్ హీరో ప‌రువు తీసిన శ్రీరెడ్డి…!

Visitors Are Also Reading