Home » అందరి ముందే కోపంతో కుర్చీ విసిరేసిన చిరంజీవి..బిత్తరపోయిన దర్శకుడు..!

అందరి ముందే కోపంతో కుర్చీ విసిరేసిన చిరంజీవి..బిత్తరపోయిన దర్శకుడు..!

by Bunty

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్య. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ సినిమాను నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగాస్టార్ అంటే మాస్ ఇమేజ్, ఆయనకు తోడుగా ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ కూడా ఇందులో యాడ్ అయ్యారు. ఇక ఈ సినిమా రిలీజ్ కాగానే మంచి టాక్ తెచ్చుకొని రూ.108 కోట్లు ఇప్పటికే రాబట్టింది. ఈ నేపథ్యంలో మొన్న సక్సెస్ మీట్ నిర్వహించారు.

అయితే ఈ సక్సెస్ మీట్ లో వాల్తేరు వీరయ్య సినిమా డైరెక్టర్ బాబీ చిరంజీవిపై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. బాబి మాట్లాడుతూ, చిరంజీవిది ఎంత మంచి మనస్తత్వం తెలియాలంటే మీకు ఈ విషయం తప్పనిసరిగా తెలియాలి. అదేంటంటే చిరంజీవి నిర్మాతలకు నష్టం వచ్చే పనులు చేస్తే అసలు ఊరుకోరు. అయితే నేను ఓ రోజు చిరంజీవి ఓ షూటింగ్ లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్లాను. ఇక అదే టైంలో చిరంజీవి ఇడ్లీ తింటున్నారు. కానీ మేనేజర్ మాత్రం చిరంజీవిని షార్ట్ రెడీ అయ్యిందని పిలవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు.

ఇక ఈ విషయం గమనించిన చిరంజీవి కుర్చి విసిరేసి ఈ బోడి పర్ఫామెన్స్ నా ముందు ఎందుకు చేస్తున్నారు. నేను ఇప్పుడు ఇడ్లీ తినడం కంటే షూటింగ్ చేయడం ఇంపార్టెంట్ అంటూ చిరంజీవి కోపంగా కుర్చి విసిరేసి వెళ్లడం చూసి నేను చాలా భయపడ్డాను. ఇక ఈ విషయంలో నేను గ్రహించింది ఏమిటంటే నిర్మాతలకు, సినిమాకు ఇబ్బంది కలిగిస్తే చిరంజీవి వెంటనే కోపం తెచ్చుకుంటారు అంటూ వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ లో డైరెక్టర్ బాబి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం డైరెక్టర్ బాబీ, చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

READ ALSO : తండ్రి అయిన టాలీవుడ్‌ స్టార్‌ కమెడియన్‌ రాహుల్‌ రామకృష్ణ

Visitors Are Also Reading