Home » అందుకే తేజస్వినిని రెండో పెళ్లి చేసుకున్నా..!

అందుకే తేజస్వినిని రెండో పెళ్లి చేసుకున్నా..!

by AJAY
Published: Last Updated on
Ad

డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభించి టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగిన దిల్ రాజు ప్రస్తుతం పాన్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. చాలా సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించిన దిల్ రాజు నితిన్ హీరోగా నటించిన దిల్ సినిమాతో ప్రొడ్యూసర్ అవతారం ఎత్తాడు. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో ఆ తర్వాత వెనక్కి చూసుకోలేదు.

Also Read: అందుకే తేజస్వినిని రెండో పెళ్లి చేసుకున్నా….దిల్ రాజు ఓపెన్ కామెంట్స్….!

Advertisement

ఇక ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా నటిస్తున్న మరో సినిమాకు సైతం దిల్ రాజు నిర్మాత గా వ్యవరిస్తున్నారు. ఈ సినిమాలతో పాటు రీసెంట్ గా తమిళ్లో బ్లాక్ బస్టర్ అయిన లవ్ టుడే సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదల చేశాడు.

Also Read: సోషల్ మీడియాలో ఆ స్టార్ హీరోలను దాటేసిన రామ్ చరణ్.. క్రేజ్ మామూలుగా లేదుగా..!

Advertisement

ఈ సినిమాకు వసూళ్ళ వర్షం కురుస్తోంది. సినిమాలలో ఎంతో సక్సెస్ చూసిన దిల్ రాజు రియల్ లైఫ్ లో ఒకానొక సమయంలో చాలా బాధపడ్డారు. దిల్ రాజు సతీమణి అనిత గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. 2007లో అనిత కన్నుమూశారు. అయితే తాజాగా తన పర్సనల్ లైఫ్ గురించి దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన భార్య అనిత చనిపోయిన తర్వాత రెండేళ్లపాటు చాలా బాధపడ్డాను అని అన్నారు. తనకున్న ఒకే ఒక్క అలవాటు గ్యాంబ్లింగ్ అని చెప్పారు.

DILL RAJU

DILL RAJU

తన తల్లిదండ్రులు కూతురు అల్లుడు తనను అలా చూడలేకపోయారని చెప్పారు. దాంతో మొదట తన పేరెంట్స్ రెండో పెళ్లి చేసుకోవాలని కోరినట్టు తెలిపారు. తన కూతురు కూడా మళ్లీ పెళ్లి చేసుకోవాలని పట్టు పట్టింది అన్నారు. ఫ్యామిలీ డిస్టబ్ అవ్వకూడదు అనే అన్ని రకాలుగా ఆలోచించి రెండో పెళ్లి చేసుకున్నానని చెప్పారు. ఇక దిల్ రాజు తేజస్విని అనే మహిళను రెండో వివాహం చేసుకోగా రీసెంట్ గా వీరికి ఒక కుమారుడు పుట్టాడు.

Also Read: సుధీర్ పోస్టర్ ను హత్తుకుంటున్న నాని.. గొప్ప నటుడు అంటూ కితాబు..!!

Visitors Are Also Reading