Home » సర్కారు వారి పాట ఓటీటీ ధర ఎంతంటే..?

సర్కారు వారి పాట ఓటీటీ ధర ఎంతంటే..?

by Azhar
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబుకు మన తెలుగు లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆయన చివరి సినిమా ఎప్పుడో 2020లో సంక్రాంతి కి సరిలేరు నీకెవ్వరు అనే పేరుతో విడుదలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమాను మహేష్ బాబు అనౌన్స్ చేశాడు. కానీ అనుకోకుండా వచ్చిన కరోనా కారణంగా ఈ సినిమా విడుదల చాలా ఆలస్యమైంది.

Advertisement

దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత 2022 మే 12న ఈ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో మహేష్ బాబుకు జంటగా కీర్తి సురేష్ నటించింది. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకున్నా… ఆ తర్వాత యావరేజ్ అనే టాక్ తెచ్చుకుంది. సినిమా స్టోరీ లో చాలా డెప్త్ ఉన్న… డైరెక్టర్ అంత దూరం వెళ్లలేదు అని అభిమానులు అభిప్రాయపడ్డారు. అయినా కూడా ఈ సినిమాకు మొదటి రోజే 75 కోట్లు కొల్లగొట్టింది.

Advertisement

ఇక రెండవ రోజు కలెక్షన్స్ ను కూడా కలుపుకుంటే ఈ సినిమా వంద కోట్లు దాటేసింది అనే విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజా సమాచారం ఏమిటంటే… సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను భారీ ధరకు కొనుగోలు చేసింది అని సమాచారం. అయితే ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లో బాగా నడుస్తూ ఉండటంతో… కనీసం ఆరు వారాల సమయం తీసుకొని దీనిని ఓటీటీ లో విడుదల చేయాలని మేకర్స్ అగ్రిమెంట్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే సర్కారు వారి పాట జూన్ చివరి వారంలో అమెజాన్ లో కి వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి :

ఉమ్రాన్ కు టీం ఇండియాలో చోటు ఖాయం : గంగూలీ

దినేష్ కార్తీక్ ప్రపంచ కప్ ఆడాలి…!

Visitors Are Also Reading