Home » Ms Dhoni : ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఆస్పత్రి పాలైన మహేంద్ర సింగ్ ధోని

Ms Dhoni : ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఆస్పత్రి పాలైన మహేంద్ర సింగ్ ధోని

by Bunty

ఐపీఎల్ 2023 టోర్నీ ముగిసిపోయింది. మొన్న మే 29వ తేదీన అంటే సోమవారం జరిగిన ఐపిఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. ఏకంగా ఐదు వికెట్ల తేడాతో… గుజరాత్ టైటాన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. దీంతో ఐపీఎల్ సూపర్ కింగ్స్ ఎగరేసుకుపోయింది. చివరి రెండు బాల్స్ కు పది పరుగులు చేయాల్సి ఉండగా… రవీంద్ర జడేజా ఒక సిక్స్ మరియు ఒక ఫోర్ బాది… మహేంద్రసింగ్ ధోనీకి అరుదైన గిఫ్ట్ అందించాడు.

దీంతో ఐపీఎల్ చరిత్రలో ఐదోసారి టోర్నైని అందుకున్న జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. అయితే ఐపీఎల్ కప్ గెలిచిన తరుణంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. తీవ్ర గాయంతో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఆసుపత్రి పాలయ్యారు. తన మోకాలి గాయం కారణంగా తాజాగా ఆసుపత్రికి వెళ్లారు మహేంద్ర సింగ్ ధోని. ఈ తరుణంలోనే మహేంద్ర సింగ్ ధోని మోకాలి ఆపరేషన్ విజయవంతం అయిందని వైద్యులు ప్రకటించారు.

ఐపీఎల్ 2023లో ఎడమ మొకాలి నొప్పితో ధోని బాధపడ్డ సంగతి తెలిసిందే. అయితే ఫైనల్ మ్యాచ్ ముగిసిన 48 గంటల తర్వాత ముంబైలోని కోకిల బెన్ అంబానీ ఆసుపత్రిలో చేరారు ధోని. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆపరేషన్ అవసరమని తేల్చారు. ఈ తరుణంలోనే ఇవాళ ఉదయం మహేంద్ర సింగ్ ధోనీకి ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్లు… శాస్త్ర చికిత్స సక్సెస్ అయినట్లు ప్రకటన చేశారు. దీంతో ధోని ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Faima : ఫైమా నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?

Shubman Gill : సచిన్‌ కూతురు కోసం..గిల్‌ త్యాగం !

భర్తను భార్య ఇలా చూసుకుంటే… మరో స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడడు !

Visitors Are Also Reading