Home » పాక్ లోనూ ధోని క్రేజ్ మామూలుగా లేదుగా.. అభిమానులు ఏం చేశారంటే

పాక్ లోనూ ధోని క్రేజ్ మామూలుగా లేదుగా.. అభిమానులు ఏం చేశారంటే

by Bunty
Ad

టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మహేంద్ర సింగ్ ధోని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మహేంద్ర సింగ్ ధోని కి ఇప్పటికీ ఓ రేంజ్ క్రేజ్ ఉంది. ధోని ఎక్కడ మ్యాచ్ ఆడిన అక్కడ జనాలు వాలిపోతూ ఉంటారు. అతను బ్యాటింగ్ చేసినా చేయకపోయినా… అలా ధోని ని చూస్తూ ఉండిపోతారు ఫ్యాన్స్. అసలు విషయాల్లోకి వెళితే… ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించి ఛాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

Advertisement

మే 29వ తేదీన జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు పై… చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఏకంగా ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో ఐదు సార్లు ఐపీఎల్ టోర్నీని గెలిచిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చరిత్ర సృష్టించింది. దీంతో మహేంద్రసింగ్ ధోని క్రేజ్ మరింత పెరిగిపోయింది. అయితే చెన్నై కప్ గెలవగానే… దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి.

Advertisement

అయితే… ఈ సంబరాలు ఇండియా వ్యాప్తంగా కాకుండానే… మన ప్రత్యర్థి పాకిస్తాన్లోనూ… సంబరాలు చేసుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కప్పు గెలవడంతో… చెన్నై జండాలతో… గల్లి గల్లి తిరుగుతూ పాకిస్తాన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. అటు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు… ప్రస్తుత స్టార్ క్రికెటర్లు కూడా మహేంద్రసింగ్ ధోని కి శుభాకాంక్షలు చెబుతున్నారు. దీంతో ధోని క్రేజ్ ప్రత్యర్థి పాకిస్తాన్లోనూ అమాంతం పెరిగిపోయిందని ఇండియన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

పవన్ కళ్యాణ్ 3వ భార్య ఆస్తులు విలువ తెలుసా?

Vijayashanthi : చిరంజీవితో 20 ఏళ్లుగా విజయశాంతి ఎందుకు మాట్లాడకుండా ఉన్నారో తెలుసా ?

Mahesh Babu : “గుంటూరు కారం”తో వచ్చేసిన ప్రిన్స్ మహేష్

Visitors Are Also Reading