Home » సౌందర్య చనిపోయిన తర్వాత ఆమె భర్త పరిస్థితి ఎలా ఉందో తెలుసా..!

సౌందర్య చనిపోయిన తర్వాత ఆమె భర్త పరిస్థితి ఎలా ఉందో తెలుసా..!

by AJAY
Ad

అందాల తార సౌందర్య అంటే తెలియని వారు ఉండరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి సౌందర్య తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంది. స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న సౌందర్య ఎక్కడా బోల్డ్ గా నటించలేదు. ముద్దు సీన్లకు కూడా సౌందర్య దూరంగా ఉంది. సంప్రదాయానికి చీర కట్టినట్టినట్టుగా కనిపించే సౌందర్య కు ఎంతోమంది అభిమానులు అయ్యారు. చిరంజీవి, వెంకటేష్ తో పాటు అప్పటి స్టార్స్ అందరి సరసన సౌందర్య నటించింది.

Also Read: సునీల్ భార్యను ఎప్పుడైనా చూశారా..? ఆమె ఏం చేస్తుందంటే..

Advertisement

సౌందర్య తండ్రి నారాయణ కు సినీ పరిశ్రమలో ఉన్న పరిచయాల తో ఆమెను హీరోయిన్ గా పరిచయం చేశారు. ఇక ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి కొద్ది రోజుల్లోనే సౌందర్య స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. హీరోయిన్ గా రాణిస్తున్న సౌందర్య ను మృత్యువు వెంటాడిదింది. హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య కన్నుమూసిన వార్త విని తెలుగు ప్రేక్షకులు షాక్ అయ్యారు.

Advertisement

Also Read: భిక్షాటన చేసి భార్యకు మోపేడ్ బహుమానంగా ఇచ్చిన యాచకుడు.. ఎక్కడంటే..?

సౌందర్య బాలయ్య తో నర్తనశాల సినిమా చేస్తున్న సమయంలో మరణించడం తో ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆమె మరనించినా ఇప్పటికీ ప్రేక్షకులు ఆమెను గుర్తు చేసుకుంటూనే ఉంటారు. హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య తో పాటు ఆమె సోదరుడు అమర్ కూడా కన్నుమూశారు. ఇక చనిపోయే నాటికే సౌందర్య కు వివాహం జరిగింది. సౌందర్య వరుసకు మేనమామ అయిన రఘును వివాహం చేసుకుంది.

రఘు సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసేవారు. సౌందర్య కు 2003 సంవత్సరం లో వివాహం కాగా అదే ఏడాది ఆమె మరణించడం తో భర్త రఘు డిప్రెషన్ లోకి వెళ్ళారు. ఆ తరవాత చాలా కాలం పాటు ఆయన ఒంటరి జీవితాన్ని గడిపారు. ఇక 2011 లో రఘు మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన తన రెండో భార్య తో కలిసి గోవాలో ఉంటున్నారు.

Also read :

భ‌య‌మేస్తుంది నాన్న‌ నేను బ‌తుక‌లేను.. వెలుగులోకి విస్మ‌య ఆడియో క్లిప్‌..!

Visitors Are Also Reading