Home » పాక్ పరువు తీసేసిన ఢిల్లీ పోలీస్..!

పాక్ పరువు తీసేసిన ఢిల్లీ పోలీస్..!

by Azhar
Ad
ఆసియా కప్ లో శ్రీలంక చేతిలో ఫైనల్ మ్యాచ్ ఓడిపోయి రన్నరప్ గా తిరిగి ఇండియాకు వెళ్ళిపోయింది పాకిస్థాన్. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ ఓడిపోవడానికి బౌలింగ్ ఎంత కారణమో.. ఫీల్డింగ్ కూడా అంతే కారణం అనే చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో మొదట్లో బాగా బౌలింగ్ చేసిన పాక్.. చివర్లో పరుగులు  బాగా ఇచ్చింది.
ముఖ్యంగా లంక బ్యాటర్ రాజపక్స పాక్ బౌలింగ్ ను చెడుగుడు ఆడేసాడు. అయితే ఇతై క్యాచ్ ను పాక్ రెండుసార్లు వదిలేసింది. మొదటిసారి చేతిలో పడిన క్యాచ్ వదిలేసిన పాక్ ఫీల్డర్లు.. తరువాత మంచి క్యాచ్ ను ఇద్దరు ఢీ కొట్టుకొని వదిలేసారు. అయితే ఇలా క్యాచ్ లు వదిలేసి మ్యాచ్ ను ఓడిపోవడం పాకిస్థాన్ కు కొత్త కాదు అనే చెప్పాలి. గత ప్రపంచ కాల్ లో కూడా సెమీస్ లో ఇలాగె క్యాచ్ ను వదిలేసి ఇంటికి వచ్చింది పాక్.
ఇక ఇప్పుడు పాక్ యొక్క ఈ క్యాచ్ మిస్ పైన ట్రోలింగ్ అనేది జరుగుతుంది. ఇక మాములు ప్రజలే కాకుండా ఢిల్లీ పోలీస్ కూడా ఈ విషయంలో పాక్ ను ట్రోల్ చేసారు. తాజాగా పాక్ ప్లేయర్స్ ఢీ కొట్టుకొని క్యాచ్ యూ వదిలేసిన క్లిప్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. చూసుకుంటూ వెళ్ళండి అంటూ వాహనదారులకు ఓ పాట ద్వారా సూచిస్తున్నారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.

Advertisement

Visitors Are Also Reading