తమిళస్టార్ హీరో రజినీకాంత్ కమార్తె ఐశ్వర్య రజినీకాంత్ తన భర్త హీరో ధనుష్ తో విడిపోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ధనుష్ కూడా సోషల్ మీడియా ద్వారా ఐశ్వర్యతో విడిపోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఇద్దరూ ఓ నోట్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. తమ పోస్ట్ లో విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రకటించడంతో పాటూ విడాకుల తరవాత కూడా స్నేహితులుగా కొనసాగుతామని చెప్పారు.
Advertisement
Advertisement
ఇదిలా ఉండగా ధనుష్ ఐశ్యర్యల వ్యవహారం చూస్తుంటే తాము స్నేహితులు గా ఉన్నామనే విషయం అందరికీ తెలిసేలా చేస్తున్నట్టు కనిపిస్తోంది. దానికి కారణం వీరిద్దిరి ట్విట్టర్ ముచ్చటనే….ఐశ్వర్య రజినీకాంత్ సొంతంగా ఓ మ్యూజిక్ వీడియోకు దర్శకత్వం వహించింది.ఈ వీడియోను తెలుగు తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. తెలుగులో మెగా హీరో అల్లు అర్జున్ చేతుల మీదుగా విడుల చేశారు.
ఇక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఐశ్వర్య రజినీకాంత్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఆమె మాజీ భర్త ధనుష్ కూడా పాటపై ఓ ట్వీట్ చేశారు. పయని మ్యూజిక్ వీడియోను తెరకెక్కించిన నా స్నేహితురాలికి అభినందనలు……అంటూ ధనుష్ పేర్కొన్నాడు. దాంతో థాంక్స్ మై ఫ్రెండ్ అంటూ ధనుష్ కు ఐశ్వర్య కృతజ్ఙతలు చెప్పింది.