Home » దగ్గుబాటి వారసుడి హీరో ఎంట్రీ ఎప్పుడో.. నో చెబుతున్న హీరోయిన్లు కారణం శ్రీరెడ్డియేనా..?

దగ్గుబాటి వారసుడి హీరో ఎంట్రీ ఎప్పుడో.. నో చెబుతున్న హీరోయిన్లు కారణం శ్రీరెడ్డియేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దగ్గుబాటి ఫ్యామిలీ అంటే ఎంతటి సినీ బ్యాక్ గ్రౌండ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామానాయుడు నుంచి మొదలు రానా వరకు అనేక మంది స్టార్ హీరోలు ఇండస్ట్రీని ఏలుతున్నారు. అంతటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న నిర్మాత సురేష్ బాబు కొడుకు దగ్గుబాటి అభిరామ్ ను హీరో కష్టాలు వెంటాడుతున్నాయి. చాలా రోజుల నుంచి హీరోగా ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నా కలిసి రావడం లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని హీరోలు మంచి మంచి సినిమాలతో స్టార్ హోదాను సంపాదించే దిశలో ప్రయాణిస్తున్నారు. ఇంతటి సినీ బ్యాగ్రౌండ్ ఉన్న అభిరామ్ హీరో గా ఎంట్రీ ఇవ్వకపోవడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. మరీ కథ ఏంటో ఒక సారి చూద్దాం.. చాలా రోజుల నుంచి దగ్గుబాటి వారసుడికి సినిమా కష్టాలు వెంటాడుతున్నాయి. ఎట్టకేలకు నిర్మాత సురేష్ బాబు ఆయన హీరోగా తీసుకురావాలని ప్రయత్నాలలో భాగంగా డైరెక్టర్ తేజ ని ఒప్పించి కథలు చేయించారు.

Advertisement

ఇదంతా బాగానే ఉన్నప్పటికీ అభిరామ్ సరసన నటించడానికి ఏ హీరోయిన్ కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కృతి శెట్టి ని డైరెక్టర్ తేజ సంప్రదించారట. కానీ ఈ అమ్మడు కూడా అభిరాం పక్కన నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. దీని తర్వాత తేజ మరో ముగ్గురు హీరోయిన్లను కూడా అడిగారట. కానీ వారు కూడా రిజెక్టు చేసారని సమాచారం. దీంతో డైరెక్టర్ తేజ కొత్త అమ్మాయిని సెలెక్ట్ చేయాలని అనుకుంటున్నారట. ఇండస్ట్రీ లో ఇంత బ్యాగ్రౌండ్ ఉన్న ఆయన సరసన నటించేందుకు హీరోయిన్లు ఎందుకు ఆసక్తి చూపడం లేదో మీకు కూడా అనుమానం వచ్చి ఉంటుంది. దీనికి ప్రధాన కారణం శ్రీరెడ్డి అని చెప్పక తప్పలేదు.

Advertisement

ఎందుకంటే గతంలో అభి రామ్ శ్రీరెడ్డి ని శరీరకంగా వాడుకుని వదిలేశారని శ్రీరెడ్డి ఆరోపణలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. తనకు న్యాయం చేయాలని ఏకంగా హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేసి ధర్నా చేపట్టి సంచలనం సృష్టించింది శ్రీ రెడ్డి. దీంతో దగ్గుబాటి వారసుడు క్యారెక్టర్ కాస్త బ్యాడ్ అయిపోయింది. అయితే ఈయన పక్కన నటించడానికి ఎందుకు దూరం ఉంటున్నారు అనే సందేహం మీకు కలగొచ్చు. అయితే ఇందులో ప్రధాన ట్విస్టు ఉంది. ఈ కథలో శ్రీ రెడ్డికి సంబంధించిన అంశం కూడా ఉందని తానే స్వయంగా చెప్పారు. దీంతో హీరోయిన్లు కాంట్రవర్సి ఎందుకు చేయడమని సినిమా కథ విని తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. అందువల్లే ఆయనకు ప్రతి హీరోయిన్ నో చెబుతున్నారని, ఇక తేజ కొత్త హీరోయిన్లను పెట్టి సినిమాలు తీసేందుకు సిద్ధమయ్యార ని సమాచారం.

ALSO READ:

Visitors Are Also Reading